నాదెండ్ల‌, క‌ళ్యాణ్ బాబు ప్యాకేజీ బిగిస్తారు!

మచిలీప‌ట్నంలో జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌పై మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్లు వేశారు. ప‌దో ఆవిర్భావ దినోత్స‌వ సందేశం ఇదే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ది బ‌ల‌మైన సంత‌కం ఉంటుంది, కానీ అది ఎల్లో…

మచిలీప‌ట్నంలో జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌పై మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్లు వేశారు. ప‌దో ఆవిర్భావ దినోత్స‌వ సందేశం ఇదే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ది బ‌ల‌మైన సంత‌కం ఉంటుంది, కానీ అది ఎల్లో పేప‌ర్ మీదే ఉంటుంది! అంటూ ఎద్దేవా చేశారు.

అలాగే కాపులంద‌రూ న‌డుం బిగించండి. నాదెండ్ల‌, క‌ళ్యాణ్ బాబు ప్యాకేజీ బిగిస్తారు! ప్యాకేజీ అంటే చెప్పు తీస్తావ్! అమ్ముడుపోయావ‌ని ఆంధ్ర‌జ్యోతి రాస్తే.. అంటూ వ‌రస ట్వీట్ల‌లో ఎద్దేవా చేశారు. మ‌చిలీప‌ట్నం స‌భ‌లో ఫ్యాకేజీ గురించి మాట్లాడుతూ.. గతంలో ప్యాకేజీ స్టార్‌ అన్నారు. నేను డబ్బులు ఆశించేవాడిని కాదు. ప్రస్తుతం నేను చేసే సినిమాకు రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నా. అలాంటి నాకు డబ్బులు అవసరం ఏముంది? అంటూ త‌ప్పించుకున్నారు.

జ‌న‌సేన సింగిల్ గా పోటీ చేసే ప్ర‌శ్నే లేద‌ని చెప్పేసారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోంది!. కానీ అది జరగదు. ఓటును వృథా కానివ్వను. టీడీపీతో పొత్తు ఉంటుందని నేరుగా చెప్పనప్పటికీ దాదాపు పొత్తుతోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోతున్న‌ట్లు తేల్చిచెప్పారు.