ఔను… వారి పాలిట జ‌గ‌న్ ద‌రిద్ర‌మే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అంటే చంద్ర‌బాబునాయుడు ఓర్వ‌లేకున్నారు. జ‌గ‌న్‌పై ఎంత ఘాటుగా విమ‌ర్శ‌లు చేయాల‌నే చింత త‌ప్ప‌, తండ్రీకొడుకులైన చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు వేరే ధ్యాసే వుండ‌డం లేదు. వైసీపీ చేప‌డుతున్న ప‌థ‌కాల‌నే తీసుకుని జ‌గ‌న్‌పై…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అంటే చంద్ర‌బాబునాయుడు ఓర్వ‌లేకున్నారు. జ‌గ‌న్‌పై ఎంత ఘాటుగా విమ‌ర్శ‌లు చేయాల‌నే చింత త‌ప్ప‌, తండ్రీకొడుకులైన చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు వేరే ధ్యాసే వుండ‌డం లేదు. వైసీపీ చేప‌డుతున్న ప‌థ‌కాల‌నే తీసుకుని జ‌గ‌న్‌పై వ్యంగ్య విమ‌ర్శ‌లు చేయ‌డానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు నువ్వే మా న‌మ్మ‌కం జ‌గ‌న్ అనే కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు త‌న‌కు అనుకూలంగా తీసుకుని ధ్వ‌జ‌మెత్తారు.

కాకినాడ జిల్లా జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ‌ ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి  కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. నువ్వే మా న‌మ్మ‌కం కాదు… నువ్వే మా ద‌రిద్రం అంటూ చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌కు ప్ర‌ధాన కార‌కుడైన వారే ఇప్పుడు మీ న‌మ్మ‌కం అంటూ స్టిక్క‌ర్ వేస్తాడ‌ట అని ఆయ‌న ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌పై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు.  

టీడీపీని కూక‌టి వేళ్ల‌తో స‌హా కూల్చివేసిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబు, లోకేశ్ పాలిట ద‌రిద్ర‌మే అని అధికార పార్టీ సోష‌ల్ మీడియా పోస్టులు పెడుతోంది. టీడీపీకి భ‌విష్య‌త్ లేకుండా చేసిన జ‌గ‌న్‌పై ఆ మాత్రం అక్క‌సు చంద్ర‌బాబు వెళ్ల‌గ‌క్క‌డాన్ని అర్థం చేసుకోత‌గిందే అని సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక‌వైపు త‌న‌యుడు లోకేశ్ పాద‌యాత్ర ఫెయిల్ కావ‌డం, మ‌రోవైపు జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో చంద్ర‌బాబుకు దిక్కుతోచ‌క సీఎంపై అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు సెటైర్స్ విసురుతున్నారు. జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం ప్ర‌జ‌ల‌కే త‌ప్ప‌, చంద్ర‌బాబు, ఆయ‌న మ‌నుషుల‌కు కాద‌ని తెలుసుకోవాల‌ని హిత‌వు చెబుతున్నారు.