విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్

విశాఖ మరోమారు రాష్ట్రాన్ని దేశాన్ని ఆకట్టుకోబోతోంది. విశాఖలో అతి పెద్ద పెట్టుబడుల సదస్సు నిర్వహణకు జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.  Advertisement విశాఖను కేంద్రంగా చేసుకుని జాతీయ స్థాయిలో పేరు గడించిన పారిశ్రామికవేత్తలను…

విశాఖ మరోమారు రాష్ట్రాన్ని దేశాన్ని ఆకట్టుకోబోతోంది. విశాఖలో అతి పెద్ద పెట్టుబడుల సదస్సు నిర్వహణకు జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. 

విశాఖను కేంద్రంగా చేసుకుని జాతీయ స్థాయిలో పేరు గడించిన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలని చూస్తోంది. అదే విధంగా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే వారి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

దావోస్ టూర్ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఇపుడు విశాఖ నుంచి పారిశ్రామిక ప్రగతి కోసం శంఖారావాన్ని పూరించనున్నారు. ఆ విధంగా ఆయన అటు రాజకీయ ప్రత్యర్ధులకు తగిన జవాబు చెప్పడమే కాకుండా తన ఏలుబడిలో ఏపీ ప్రగతి కాంతులను సంతరించుకుందని జనాలకు కూడా చెప్పబోతోన్నారు.

దీనికి సంబంధించి అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. తొందరలో విశాఖ సాగర తీరం ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో అతి పెద్ద పారిశ్రామిక సదస్సుని జరపుకుంటోంది. 

విశాఖ పెట్టుబడిదారులకు ఘన స్వాగతం పలకబోతోంది. రానున్న రోజుల్లో ఏపీలో పెట్టుబడుల వరద పారేలా ఈ సదస్సు ఉంటుందని వైసీపీ సర్కార్ పెద్దలు భావిస్తున్నారు.