బెయిల్ మీద తిరిగే దొంగ చంద్రబాబు…!

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. సుప్రీంకోర్టు లో బాబు వేసిన క్వాష్ పిటిషన్ మీద వచ్చిన తీర్పులో ఎలాంటి ఊరట అయితే లభించలేదని ఆయన…

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. సుప్రీంకోర్టు లో బాబు వేసిన క్వాష్ పిటిషన్ మీద వచ్చిన తీర్పులో ఎలాంటి ఊరట అయితే లభించలేదని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశానికి పెద్ద ఎత్తున ఊరట లభించింది అంటూ ప్రచారం చేసుకోవడం పట్ల మంత్రి ఫైర్ అయ్యారు.

స్కిల్ స్కాం కేసు సెక్షన్ 17 ఏ అమల్లోకి రాకముందే ఉందని మంత్రి గుర్తు చేశారు. క్వాష్ పిటిషన్ అంటూ సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని చంద్రబాబు టీడీపీ నేతలు ఇప్పటిదాకా చెబుతూ వస్తున్నారు కానీ తాము స్కిల్ స్కాం కేసులో ఏ తప్పూ చేయలేదని మాత్రం ఎక్కడా చెప్పడంలేదని మంత్రి లాజిక్ పాయింట్ తీశారు.

తాను తప్పు చేయలేదని చంద్రబాబు ఎందుకు మాట్లాడరూ అని ఆయన నిలదీశారు. చంద్రబాబు కి సుప్రీం కోర్టులో ఏ ఊరటా దక్కలేదని బెయిల్ మీద తిరుగుతున్న దొంగ చంద్రబాబు అని గుడివాడ అంటున్నారు. టెక్నికల్ రీజన్స్ ని చూపించి కేసులు తప్పించుకుందామని చంద్రబాబు టీడీపీ నేతలు చూస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఎన్ని చేసినా కూడా చంద్రబాబుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

చంద్రబాబుకు ఈ కేసులో ఏరకమైన ఊరట లభించకపోయినా టీడీపీ నేతలు మాత్రం వక్ర భాష్యాలతో జనాలకు మభ్యపెట్టాలని చూస్తున్నారు అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ మీద టీడీపీకి నిజంగా ఊరట దక్కితే పరిస్థితి ఇలా ఉండేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.