బాబువి మాటలే…జగన్ ది యాక్షన్

మేము టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ దెబ్బకు మాయం అవుతుంది. ఆ పార్టీకి చెందిన వారు ఒక్కరంటే ఒక్కరు మిగలరు అని తాజాగా చంద్రబాబు అన్నారు. వైసీపీయే టీడీపీగా మారుతుంది అని గంభీర వ్యాఖ్యలే…

మేము టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ దెబ్బకు మాయం అవుతుంది. ఆ పార్టీకి చెందిన వారు ఒక్కరంటే ఒక్కరు మిగలరు అని తాజాగా చంద్రబాబు అన్నారు. వైసీపీయే టీడీపీగా మారుతుంది అని గంభీర వ్యాఖ్యలే చేశారు. ఆయన మంగళవారం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేస్తున్న టైం లోనే టీడీపీకి 2019 దాకా కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలో జగన్ సమక్షంలో చేరడం విశేషం.

వైసీపీలో చేరిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, విశాఖ డైరీ డైరెక్టర్ రమణారావు, అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్, మాజీ ఎంపీపీ ధనమ్మ, విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాజా వంటి వారు ఉన్నారు.

ఇది ఆరంభం మాత్రమే అని వైసీపీ నేతలు అంటున్నారు. రానున్న రోజులలో మరింతమంది నాయకులు బిగ్ షాట్స్ కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతారు అని అంటున్నారు. టీడీపీ వైసీపీగా మారుతుందా లేదో అపుడు తెలుస్తుంది అని అంటున్నారు. 

బాబువి మాటలే అని తమది యాక్షన్ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ షాక్ నుంచి టీడీపీ తేరుకుని తమ పార్టీ నేతలను కాపాడుకుంటుందా లేదా అన్నదే ఇపుడు హాట్ డిస్కషన్ గా ఉంది.