ఈ అడుక్కునే బతుకు నీకెందుకు పవనూ..!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, మరోసారి పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. టీడీపీ, బీజేపీలను అడుక్కోవడం మానేయాలని, నేరుగా తన దగ్గరకు రావాలని సూచించారు. తనతో చేతులు కలిపితే ఇంటర్నేషనల్ నటుడ్ని…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, మరోసారి పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. టీడీపీ, బీజేపీలను అడుక్కోవడం మానేయాలని, నేరుగా తన దగ్గరకు రావాలని సూచించారు. తనతో చేతులు కలిపితే ఇంటర్నేషనల్ నటుడ్ని చేస్తానంటూ పవన్ కు ఆఫర్ ఇచ్చారు.

“తమ్ముడు పవన్ కల్యాణ్, నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను. నాతో వచ్చేసెయ్. నీ పార్టీని నా పార్టీలో విలీనం చేసెయ్. నిన్ను ఇంటర్నేషనల్ నటుడిగా చేస్తాను. ఏంజెలినా జోలీ, టామ్ క్రూస్, మైక్ టైసన్.. వీళ్లంతా నాకు మిత్రులు. వాళ్లతో చెప్పి నిన్ను అంతర్జాతీయ నటుడ్ని చేస్తాను. నువ్వు యాక్టింగ్ లో ఉండు, నేను రియల్ హీరోగా ఉంటాను. నా పార్టీకి ప్రచారం చేయి, ఊరూరా ప్రచారం చేసి నా పార్టీలోకి జనాల్ని చేర్పించు, నాకు అధికార ప్రతినిధిగా ఉండు.”

ఇలా పవన్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్. టీడీపీ, బీజేపీకి దూరంగా ఉండాలని.. ప్యాకేజీ స్టార్ అనే ఇమేజ్ నుంచి బయటకు రావాలని సూచించారు.  

“అప్పట్లో చిరంజీవితో కలిసి అతడి పార్టీని విలీనం చేశాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు బీజేపీతో కలిసి తన పార్టీని విలీనం చేయాలనుకుంటున్నాడు. ఇలాంటి పనులు వద్దు పవన్.. నువ్వు వచ్చేసెయ్. అడుక్కునే బతుకు నీకెందుకు. చంద్రబాబు, మోడీ, కేసీఆర్ అడుక్కుంటే నేను వాళ్లందరికీ ఇచ్చా. నువ్వెళ్లి వాళ్లను అడుక్కుంటావెందుకు. నా దగ్గరకు రా. అందరితో ఎందుకు ప్యాకేజీ స్టార్ అనిపించుకుంటావ్. నీకు నేనున్నాను.”

పవన్ కల్యాణ్ ను వదిలేసి తన పార్టీలోకి రావాలని జనసైనికులకు పిలుపునిచ్చారు కేఏ పాల్. అందరూ తన జెండా మోయాలని, తనను ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు.