జనసేనలో ఆమెదే లోకం!

విజయనగరం జిల్లాలో జనసేన గెలిచిన ఏకైక సీటు నెల్లిమర్ల. లోకం మాధవి ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సీటు విషయంలో టీడీపీ సీనియర్ నేతలు అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నా చివరికి కూటమి…

విజయనగరం జిల్లాలో జనసేన గెలిచిన ఏకైక సీటు నెల్లిమర్ల. లోకం మాధవి ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సీటు విషయంలో టీడీపీ సీనియర్ నేతలు అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నా చివరికి కూటమి మిత్ర ధర్మాన్ని పాటించి మద్దతు ఇచ్చారు. దాంతో భారీ విజయం ఆమెకు సొంతం అయింది.

అయితే గెలిచిన తరువాత లోకం మాధవి వన్ మ్యాన్ షో చేస్తున్నారు అని వాపోతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి పెద్ద పీట వేయకుండా ఆమె తన చుట్టూ ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని ద్వితీయ శ్రేణి నాయకులు కుమిలిపోతున్నారట.

ఈ మొత్తం పరిణామాల నేపథ్యం చూసినపుడు నామినేటెడ్ పదవుల మీద ఆశలు పెట్టుకున్న సీనియర్లు అవి తమకు అందుతాయా లేదా అని కూడా మధన పడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఎవరినీ పట్టించుకోకపోవడంతో కొంతమంది నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు అని అంటున్నారు.

పదవులు కీలక నేతలకు ఇస్తే వారు తనకు ఎక్కడ పోటీ అవుతారో అని జనసేన మహిళా ఎమ్మెల్యే ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆమె తనదైన శైలిలో చేస్తున్న ఈ రాజకీయం చూసిన వారు ఆమె పోకడలను తప్పు పడుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎవరి అవసరమూ లేదు అన్నట్లుగా ఆమె తీరు ఉండడం పట్ల మాత్రం పార్టీలో నిరసన వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.

పార్టీలో చురుకుగా ఉన్న వారు పార్టీని అభిమానించేవారు సైతం తమకు తగిన ప్రోత్సాహం లేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. ఇవన్నీ చూస్తూంటే నెల్లిమర్ల జనసేనలో ఆమెదే లోకం. ఆమెదే రాజ్యం అని విమర్శలు కూడా చేస్తున్నారు. దీనిని అధినాయకత్వమే చక్కదిద్దాలని కోరుతున్నారుట.

11 Replies to “జనసేనలో ఆమెదే లోకం!”

  1. అంతేగా ఎక్కడో ఎవరో అడ్రస్ లేని వారికి టికెట్ ఇస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లే గెలుపు సాధించి ఒంటెద్దు పోకడతో పోవడం ఖాయం కాకపోతే మరేమిటి

  2. పోరా చెట్టా నా కొడకా గ్రేట్ ఆంద్ర గాడు వీడు వైసీపీ చెంచ గాడు . కుటమి కి వ్యతిరేఖం గా విడి వార్తలు ఉంటాయి

Comments are closed.