అబ్బో లోకేశ్‌లో ఈ కోణం కూడానా!

నేనొస్తున్నా…ఇక 30 రోజులే గ‌డువు అంటూ నారా లోకేశ్ త‌న గురించి ఓ ట్వీట్ చేసుకున్నారు. త‌న‌ను తాను నాయ‌కుడిగా నిరూపించుకునేందుకు ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ఇంత కాలం సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల‌కే…

నేనొస్తున్నా…ఇక 30 రోజులే గ‌డువు అంటూ నారా లోకేశ్ త‌న గురించి ఓ ట్వీట్ చేసుకున్నారు. త‌న‌ను తాను నాయ‌కుడిగా నిరూపించుకునేందుకు ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ఇంత కాలం సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. ప‌నిలో ప‌నిగా ఆయ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై సెటైర్స్ వేస్తూ ఇవాళ మ‌రో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే…అబ్బో లోకేశ్‌లో సెటైర్స్ వేసే కోణం కూడా ఉందా? అని ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఎందుకంటే విమ‌ర్శ‌ల కోస‌మే విమ‌ర్శ‌లు చేసే ఛీప్ పాలిటిక్స్‌కు లోకేశ్ నిలువెత్తు ఉదాహ‌ర‌ణ అనే విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి.

వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై లోకేశ్ త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ప్ర‌ధాని మోదీతో త‌మ‌కు అపాయింట్‌మెంట్ దొర‌క‌క‌పోవ‌డం, మ‌రోవైపు జ‌గ‌న్ సులువుగా వెళ్లి క‌లుస్తుండ‌డం స‌హ‌జంగానే చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌తో పాటు టీడీపీకి గిట్ట‌దు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జ‌గ‌న్ అద్దాలు పెట్టుకుని, వింత చూపు చూస్తున్న‌ట్టుగా డిజైన్ చేయించి, దానిపై ప్ర‌శ్న‌ల‌తో కూడిన సెటైర్స్‌ను అచ్చోశారు.

ఏ1 రెడ్డి గారు మరోసారి ఢిల్లీ టూరు ఎందుకు? అని మొద‌లైన నిల‌దీత‌…ఆయ‌నే స‌మాధానాలు కూడా చెప్ప‌డం గ‌మ‌నార్హం. బాబాయ్‌ని లేపేసిన తమ్ముడిని కాపాడుకోవడానికా? లేదంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ2 ఫ్యామిలీని రక్షించడానికా? అప్పులు చేయడానికి అనుమతి కోసమా? అంటూ లోకేశ్ జ‌వాబులు, ప్ర‌శ్న‌లు క‌ల‌గ‌లిపిన ట్వీట్ సంధించడం విశేషం.  

వ‌చ్చే నెల‌లో లోకేశ్ పాద‌యాత్ర ప్రారంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత వ‌ర‌కూ ఎవ‌రో రాస్తే సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌తో పాటు వైసీపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న పేరుతో విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇక‌పై ప్ర‌జ‌ల మ‌ధ్య న‌డ‌వాల్సిన ప‌రిస్థితి. అప్పుడు లోకేశ్ క్రియేటివిటీ ఏంటో త‌ప్ప‌క బ‌య‌ట‌ప‌డుతుంది. జ‌గ‌న్‌పై సెటైర్స్ వేసే స్థాయికి ఎదిగావా లోకేశ్ అంటూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ప్ర‌శ్నిస్తున్నారు. లోకేశ్ పాద‌యాత్ర‌కు సంబంధించి ….  బ్యాగ్రౌండ్‌లో యువ‌గ‌ళం, అలాగే ఆయ‌న న‌డుస్తున్న ఫొటో ఆక‌ట్టుకుంటోంది. ఇక బ‌రిలో దిగితే ఎలా వుంటుందో చూడాలి.