ఏపీ మంత్రి ఎస్కార్ వాహ‌నం టైర్ పేలి….!

ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహ‌నం టైర్ పేలి… ఐదుగురు తీవ్రగాయాల‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తు మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. మెంటాడ టీడీపీ మండ‌ల అధ్య‌క్షుడి త‌ల్లి మ‌ర‌ణంతో ప‌రామ‌ర్శ‌కు మంత్రి బ‌య‌ల్దేరారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా…

ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహ‌నం టైర్ పేలి… ఐదుగురు తీవ్రగాయాల‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తు మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. మెంటాడ టీడీపీ మండ‌ల అధ్య‌క్షుడి త‌ల్లి మ‌ర‌ణంతో ప‌రామ‌ర్శ‌కు మంత్రి బ‌య‌ల్దేరారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌భ‌ద్ర‌పురం స‌మీపంలోని భూసాయ‌వ‌ల‌స వ‌ద్ద మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ వాహ‌నం టైర్ పేలింది. ఎస్కార్ట్ వాహ‌నం అదుపు త‌ప్పి మ‌రో వ్యాన్‌ను ఢీకొంది.

ఇద్ద‌రు గ‌న్‌మెన్లు, మ‌రో ముగ్గురు వ్య‌క్తుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వీళ్ల‌లో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను మంత్రి ద‌గ్గ‌రుండి జిల్లా ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను ఆమె ఆదేశించారు. ఈ ప్ర‌మాదంపై ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌మాద విష‌యం తెలుసుకుని పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి చేరుకున్నాయి. క్ష‌తగాత్రుల కుటుంబ స‌భ్యుల్లో ఆందోళ‌న నెల‌కుంది. త‌మ వాళ్ల ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

11 Replies to “ఏపీ మంత్రి ఎస్కార్ వాహ‌నం టైర్ పేలి….!”

  1. సాడ్. సరైన మైంటెనెన్సు లేకపోతే ఇలానే అవ్వుద్ది. ముందు వీల్స్ ఎప్పుడు కొత్తవి వెయ్యాలి. బాడ్ రోడ్స్ కూడా ఒక కారణం. పోలీస్ వెహికల్స్ కి ఎప్పుడు మైంటెనెన్సు బడ్జెట్ లో కోతలే.

Comments are closed.