జగన్ చెల్లెలు ఇచ్చి పడేసింది

గుర్తు లేని వాళ్ళు గుర్తింపు లేని వారు ఎగిరెగిరి పడుతున్నారంటూ పవర్ ఫుల్ డైలాగులతో కురుపాం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఇండైరెక్ట్ గానే అయినా జనసేన మీద ఘాటు విమర్శలు…

గుర్తు లేని వాళ్ళు గుర్తింపు లేని వారు ఎగిరెగిరి పడుతున్నారంటూ పవర్ ఫుల్ డైలాగులతో కురుపాం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఇండైరెక్ట్ గానే అయినా జనసేన మీద ఘాటు విమర్శలు చేశారు. 
ఆమె స్పీచ్ జగన్ సమక్షంలో వాడి వేడిగా సాగింది. 

విపక్షాలకు అడుగడుగునా పంచులేస్తూ శ్రీవాణి గతంలో ఎన్నడూ లేని విధమైన ప్రసంగం చేశారు. విపక్షాలు అన్నీ కలసి జగన్ని టచ్ చేయాలని చూస్తున్నాయని కానీ ఆయన నీడను కూడా తాకలేరంటూ పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు.

జగన్ నీడను తాకాలన్న కష్టమే అంటూ సవాల్ చేశారు. ఆరు కోట్ల మంది ఆంధ్రుల గుండెలలో జగనన్న గూడు కట్టుకుని ఉన్నారని ఆయనని సీఎం సీటు నుంచి అంగుళం కూడా కదల్చలేరని ఆమె అంటున్నారు. 

చంద్రబాబుకు ఆమె పంచులు పేల్చారు. జగన్ పథకాలు ఆలోచనలను కాపీ కొట్టవచ్చేమో కానీ బాబూ జగన్ కమిట్ మెంట్ ని ప్రజల పట్ల ఉన్న ఆయన తపనను, ప్రతీ పధకాన్ని నిక్కచ్చిగా అమలు చేసే నైజాన్ని ఎప్పటికీ బాబు కాపీ కొట్టలేరని అది ఆయన వల్ల కాదని అన్నారు.

అటు యువగళం ఇటు నారాహి యాత్ర ఏదైనా కూడా జగన్ ప్రజా బలం ముందు బలాదూర్ అంటూ పుష్ప శ్రీవాణి చేసిన స్పీచ్ ఇపుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. వైసీపీ వారికి ఫుల్ జోష్ ఇచ్చేలా ఈ మహిళా నాయకురాలి స్పీచ్ సాగింది.