కమలం జ్యూస్ తాగుతావా, ఫ్యాన్ ఏసుకుంటావా.. నాని!

గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు కురిపిస్తూ తనకు తాను పెద్ద నిజాయితీపరునంటూ చెప్పుకుంటూ వస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన పేరు ఎత్తకుండానే ఈసారి ట్వీట్ట‌ర్ వేదిక‌గా విమర్శలు కురిపించారు…

గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు కురిపిస్తూ తనకు తాను పెద్ద నిజాయితీపరునంటూ చెప్పుకుంటూ వస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన పేరు ఎత్తకుండానే ఈసారి ట్వీట్ట‌ర్ వేదిక‌గా విమర్శలు కురిపించారు వ్యాపార వేత్త  పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్. 

బెజవాడ భల్లూకమా.. నీకు చిరెత్తితే చిరిగేది నీ చాట, వుడేది నీ ప్యాంటు..నువ్వేదో మహా ప్రతివ్రతని అంటూ నువ్వు చూపే సోయగాలకు సొంగలు కార్చే విటులు విజయవాడలో ఎవ్వరు లేరు, ఈ ఎండల్లో కారెక్కుతావో, కమలం జ్యూస్ తాగుతావో లేక ఫ్యాన్ ఏసుకుంటావో … రాబోయే నీ దుర్ధినం.. మా అందరి సుదినం.. అంటూ ట్వీట్ చేశారు. గ‌తంలో కూడా నీ బిల్డప్ ఏందయ్యా నాని అంటూ .. దొబ్బెది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వేదవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు స‌ల‌హా ఇచ్చిన విష‌యం తెలిసిందే.

కేశినేని నాని త‌న సొంత పార్టీలోని నేతలను తిడుతున్న వారు సైలెంట్ గా ఉంటున్నారు కానీ, గతంలో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన‌ పీవీపీ మాత్రం ఈ మధ్యకాలంలో ఆయ‌నపై కౌంట‌ర్లు వేస్తున్నారు. మ‌రి మ‌రోసారి వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ వేరువేరు పార్టీల నుండి ఎన్నికల్లో బ‌రిలో దిగుతారా లేదా అనేది చూడాలి. 

గత ఎన్నిక‌ల్లో వైసీపీ నుండి పోటీ చేసిన పీవీపీ.. పార్టీ అధికారంలో రాగానే ఎక్కడ పార్టీ కార్యక్రమంలో పెద్ద‌గా క‌న‌ప‌డ‌లేదు. అలాగే కేశినేని నాని కూడా సొంత పార్టీపై గత కొంతకాలంగా విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. మ‌రి ఇరువురు నేతలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీపై నిలబడతార‌నే ఆసక్తి నెలకొంది.