ఈ జన్మకి మళ్లీ సీఎం కాలేవు…!

చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ముఖ్య‌నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి  విరుచుకుప‌డ్డారు. బాబు, లోకేశ్‌లపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌సాయిరెడ్డి త‌న మార్క్ విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌తో క‌వ్వించే సంగ‌తి తెలిసిందే. క‌ర్నూలు జిల్లాలో చంద్ర‌బాబు మాట్లాడుతూ త‌న‌కివే…

చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ముఖ్య‌నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి  విరుచుకుప‌డ్డారు. బాబు, లోకేశ్‌లపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌సాయిరెడ్డి త‌న మార్క్ విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌తో క‌వ్వించే సంగ‌తి తెలిసిందే. క‌ర్నూలు జిల్లాలో చంద్ర‌బాబు మాట్లాడుతూ త‌న‌కివే చివ‌రి ఎన్నిక‌లంటూ భావోద్వేగాన్ని పండించిన సంగ‌తి తెలిసిందే. బాబు కామెంట్స్‌పై వైసీపీ ఘాటు వ్యాఖ్య‌లు చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇదే అవ‌కాశంగా తీసుకుని విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్య‌ల‌తో చెల‌రేగిపోయారు. ఇందుకు ట్విట‌ర్‌ను వాడుకున్నారు. బాబుపై విజ‌య‌సాయిరెడ్డి హాట్ కామెంట్స్ ఏంటంటే…

“మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం? చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు” అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. సీఎంగా చంద్ర‌బాబు పీకిందేమీ లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి తేల్చి చెప్పారు.

సీఎం ప‌ద‌వి కోసం కొత్త బిచ్చ‌గాడి అవ‌తార‌మెత్తిన‌ట్టు బాబుపై విరుచుకుప‌డ్డారు. బాబుకు కుల‌పిచ్చి అని దెప్పి పొడిచారు. మూడు ద‌శాబ్దాలు స‌ర్వ‌నాశ‌నం చేసిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. చివ‌రిగా ఇక జ‌న్మ‌లో సీఎం కాలేవ‌ని బాబుకు శాప‌నార్థాలు పెట్టారు. వ‌రుస‌కు త‌న‌కు చంద్ర‌బాబు అన్న అవుతార‌ని అప్పుడెప్పుడో విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన‌ట్టు గుర్తు. అన్న ఇక ఎప్ప‌టికీ సీఎం కాలేర‌ని త‌మ్ముడైన విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌డం ఆస‌క్తిక‌ర అంశం.