రెడ్డి కమ్మగా మారితేనే సమస్య!

బీసీల సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్సీపి ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన బీసీల అత్మీయ స‌మావేళ‌నం పై టీడీపీ యువ కిశోరం నారా లోకేష్ విజ‌య‌సాయి రెడ్డిని విమర్శించడంతో తనదైన…

బీసీల సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ఆర్సీపి ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన బీసీల అత్మీయ స‌మావేళ‌నం పై టీడీపీ యువ కిశోరం నారా లోకేష్ విజ‌య‌సాయి రెడ్డిని విమర్శించడంతో తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.

ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ” విజయసాయి 'రెడ్డి', సుబ్బా 'రెడ్డి', పెద్ది 'రెడ్డి', సజ్జల రామకృష్ణా 'రెడ్డి' ఎప్పుడు బీసీలుగా మారారు? వీరికి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా? అంతా జగన్ 'రెడ్డి' మాయ!” అంటూ విమ‌ర్శించారు.

దానికి విజయసాయిరెడ్డి కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు “పప్పూ… మేమంతా రెడ్లమే గానీ; మేం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీ నిరుపేదలకు సేవకులం!, రెడ్డి రెడ్డిగా ఉంటే ఏ సమస్యా లేదు, రెడ్డి కమ్మగా మారితేనే సమస్య!ష అన్నారు

మొత్తానికి గ‌తంలో విజ‌య‌సాయి రెడ్డి చెప్పిన‌ట్లు మీరు ఒక‌టి అంటే మేము ప‌ది అంటాము అన్న‌ట్లుగానే నారా లోకేష్ పై గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.