మ‌హేశ్‌బాబును ఓదార్చిన జ‌గ‌న్‌

సూప‌ర్‌స్టార్ కృష్ణ పార్థివ‌దేహానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. కృష్ణ కుటుంబంతో వైఎస్సార్ కుటుంబానికి స‌న్నిహిత సంబంధాలున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణ క‌డ‌సారి చూపు కోసం సీఎం జ‌గ‌న్ హైద‌రాబాద్ వెళ్లారు.…

సూప‌ర్‌స్టార్ కృష్ణ పార్థివ‌దేహానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. కృష్ణ కుటుంబంతో వైఎస్సార్ కుటుంబానికి స‌న్నిహిత సంబంధాలున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణ క‌డ‌సారి చూపు కోసం సీఎం జ‌గ‌న్ హైద‌రాబాద్ వెళ్లారు. ప‌ద్మాల‌య స్టూడియోలో కృష్ణ పార్థివ‌దేహంపై పుష్ప‌గుచ్చం ఉంచి జ‌గ‌న్ నివాళి అర్పించారు.

అనంత‌రం కృష్ణ కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు జ‌గ‌న్ వెళ్లారు. కుటుంబ స‌భ్యులను పేరుపేరునా కృష్ణ సోద‌రుడు ఆదిశేష‌గిరిరావు ప‌రిచ‌యం చేశారు. వారితో జ‌గ‌న్ మాట్లాడుతూ బాధ‌ను షేర్ చేసుకున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబును జ‌గ‌న్ ఆలింగ‌నం చేసుకుని ఓదార్చారు. కృష్ణ‌తో త‌మ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కుటుంబ స‌భ్యుల‌తో జ‌గ‌న్ పంచుకున్నారు.

కృష్ణ అల్లుడు, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, ఆయ‌న త‌ల్లి ,మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి తదిత‌రుల‌ను జ‌గ‌న్ ప‌ల‌క‌రించారు. వారితో మాట్లాడ్డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 

జ‌గ‌న్‌తో పాటు స‌హ‌చ‌ర మంత్రులు కూడా కృష్ణ‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డి నుంచి జ‌గ‌న్ విజ‌య‌వాడ‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు.