ప్ర‌భుత్వ ఏర్పాటుపై ఆరా.. క‌స్సుమంటున్న తాడేప‌ల్లి!

మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా వైసీపీ నేత‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ, బెట్టింగ్‌ల పుణ్య‌మా అని వారిలో ఆందోళ‌న క‌నిపిస్తోంది. కూట‌మిదే అధికారం అని ఎక్కువ‌గా బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయి. దీంతో వైసీపీ నేత‌ల్లో ఏ మూలో చిన్న…

మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా వైసీపీ నేత‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ, బెట్టింగ్‌ల పుణ్య‌మా అని వారిలో ఆందోళ‌న క‌నిపిస్తోంది. కూట‌మిదే అధికారం అని ఎక్కువ‌గా బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయి. దీంతో వైసీపీ నేత‌ల్లో ఏ మూలో చిన్న అల‌జ‌డి. దీంతో తాడేప‌ల్లిలో వుంటున్న వైసీపీ ముఖ్య నేత‌లకు ఫోన్ చేసి …ఎన్నిక‌ల ఫలితాల‌పై ఆరా తీస్తున్నారు.

వైసీపీ పెద్ద‌లు భారీగా మ‌న‌కు సీట్లు రాబోతున్నాయ‌ని, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని స‌మాధానం చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ మ‌న‌సులో భ‌యాన్ని అణ‌చుకోలేక‌… క‌నీసం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేంత‌గా సీట్లు వ‌స్తాయి క‌దా? అని అడుగుతున్నారు. ఈ ప్ర‌శ్న‌కు వైసీపీ పెద్ద‌ల్లో తియ్య‌టి కోపం వ‌స్తోంది. 

“ఏం మాట్లాడ్తున్నారు? ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డ‌మ‌నే విష‌యాన్నే మ‌రిచిపోండి. ఎవ‌రూ ఊహించ‌న‌న్ని సీట్లు మ‌న‌కు రాబోతున్నాయి” అంటూ ఎంతో ధీమాగా భ‌రోసా ఇస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కూట‌మి నేత‌లు ఎన్ని ర‌కాలుగా ప్ర‌చారం చేసుకుంటున్నా, వైసీపీ నేత‌ల్లో మాత్రం ఒక్క శాతం కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేమ‌నే అప‌న‌మ్మ‌కం లేదు.

ఎన్నిక‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత వివిధ ర‌కాల సంస్థ‌ల‌తో వైసీపీ స‌ర్వేలు చేయించింది. ప్ర‌తి స‌ర్వేలో కూడా అనుకూల ఫ‌లితాలు రావ‌డమే కాదు, భారీ సంఖ్య‌లో సీట్లు వ‌స్తున్న‌ట్టు తేలింది. అందుకే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఏర్పాటుపై కాకుండా, కేవ‌లం సీట్ల‌పైనే మాట్లాడ్డాన్ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.