వైసీపీ ఎమ్మెల్యేల పీఏల‌కూ వ‌ర్క్‌షాప్‌

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై వైసీపీ మ‌రో వ‌ర్క్‌షాప్ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యించింది. ఇటీవ‌ల ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు త‌దిత‌రుల‌కు సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో స‌ద‌రు కార్య‌క్ర‌మంపై వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా…

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై వైసీపీ మ‌రో వ‌ర్క్‌షాప్ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యించింది. ఇటీవ‌ల ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు త‌దిత‌రుల‌కు సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో స‌ద‌రు కార్య‌క్ర‌మంపై వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా 175కి 175 సీట్లు సాధించాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని 8 నెల‌ల పాటు కొన‌సాగించాల‌ని షెడ్యూల్ కూడా ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ మ‌రో కీల‌క స‌మావేశానికి నిర్ణ‌యం తీసుకుంది. ఈ ద‌ఫా ఎమ్మెల్యేలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుల (PA)కు ఈ నెల 13న సోమ‌వారం సీఎం క్యాంప్ కార్యాల‌యంలో ఉద‌యం 10.30 నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు స‌మావేశం ఏర్పాటు చేశారు.

సీఎం ఆదేశాల మేర‌కు ఏర్పాటు చేసిన వ‌ర్క్‌షాప్‌న‌కు ప్ర‌జాప్ర‌తినిధుల వ్య‌క్తిగ‌త‌ స‌హాయ‌కులు హాజ‌రు కావాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి పేరు, ఫోన్ నంబ‌ర్‌, ఫొటోను వెంట‌నే కేంద్ర కార్యాల‌యానికి వాట్స‌ప్‌లో పంపాల‌ని కోరారు. 

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి త‌దిత‌రులు వ‌ర్క్‌షాప్‌లో దిశానిర్దేశం చేసే అవ‌కాశాలున్నాయి.