ఏపీ బీజేపీ తాము నిలబడే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది అందరూ ఊహించినట్లే మెజారిటీ వాటా చంద్రబాబు వర్గానికి దక్కింది. బీజేపీ పూర్వ నాయకులను పక్కన పెట్టి కేవలం చంద్రబాబుకు సన్నిహితులుగా చెప్పుకోనే వారే సీట్లు తెచ్చుకున్నారు.
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఎచ్చెర్ల- ఈశ్వరరావు, విశాఖ నార్త్-విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ - రాజారావు, అనపర్తి-శివక్రిష్ణంరాజు, కైకలూరు- కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి, బద్వేల్- బొజ్జ రోశన్న, జమ్మలమడుగు- ఆదినారాయణరెడ్డి, ఆదోని- పార్ధసారధి, ధర్మవరం - వై సత్య కుమార్లు ఉన్నారు. ఇందులో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్ ఉన్నారు. అలాగే టీడీపీ రాజ్యసభ ఎంపీగా సుజనా చౌదరి పని చేశారు.
మరి ముఖ్యంగా ధర్మవరంలో చంద్రబాబు వర్గం అయిన పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరిని పక్కన పెట్టి కడపకు చెందిన బీజేపీ నేత సత్య కుమార్ కు ఇవ్వడం గమనార్హం. సత్యకుమర్ బీజేపీలో ఉన్న నిత్యం చంద్రబాబు కోసం పని చేస్తూ టీడీపీ మీడియాలో జగన్పై వ్యతిరేక వార్తలు రాస్తుండటం తెలిసిందే. అలాగే అనంతపురం లోకల్ బీజేపీ లీడర్ అయినా విష్ణువర్ధన్ రెడ్డికి మొండి చేయి చూపారు.
ఇక విజయవాడ వెస్ట్లో టీడీపీ కోసం రక్తం ధారపోస్తూ నిత్యం మీడియాలో కనపడే బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ ను కాదని, ఇన్ని రోజులు జనసేన, పవన్ కళ్యాణ్ కోసం పని చేసిన పొతిన మహేశ్ను కాదని కేవలం చంద్రబాబు మనిషిగా ముద్ర పడిన కారణంతో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ దక్కించుకున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు