Advertisement

Advertisement


Home > Politics - Andhra

స్వామి చెప్పిన జగన్ జాతకం

స్వామి చెప్పిన జగన్ జాతకం

కొత్త తెలుగు సంవత్సరం వచ్చింది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉంటాయన్న దాని మీద పంచాంగకర్తలు జోస్యాలు చెబుతున్నారు. ఎవరి పంచాంగం వారికి బాగానే ఉంటుందని చెప్పడం ఆనవాయితీ.

విశాఖ శ్రీ శాదరాపీఠంలో శ్రీ శుభకృత్ సంవత్సరంలో ఏపీ సీఎం జగన్ జాతకం ఎలా ఉంటుంది అన్న దాని మీద స్వరూపానందేంద్రస్వామి చెప్పిన జాతకం చూస్తే ఆసక్తిగా ఉంది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకూ దేశంలో కొన్ని ఇబ్బందులు వస్తాయని స్వామి వెల్లడించారు.

ఈ ఏడాది నాలుగు గ్రహాలతో కూటమిగా కొత్త సంవత్సవరం ప్రారంభం అవుతోనని,అందువల్ల దేశానికి కొన్ని సమస్యలు తప్పవని స్వామి తెలియజేశారు. గత మూడేళ్ళుగా కాలసర్ప దోషంతో దేశం అన్ని రకాలుగా ఇక్కట్లు పడిందని స్వామి గుర్తు చేశారు.

ఈ ఏడాది కూడా ఇబ్బందులు ఉంటాయని ఉత్తరాది రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. అలాగే దేశమంతటా వాహన ప్రమాదాలు అధికమవుతాయన్నారు. ఈసారి భారీ ఎండలు, వడ దెబ్బలు ఎక్కువగా ఉంటాయని జూలై నుంచి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయన్నారు.

దేశంలో పరిస్థితితులు ఇలా ఉన్నా దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం జగన్,తెలంగాణా సీఎం కేసీయార్ జాతకాలు బాగానే ఉన్నాయని స్వామి చెప్పడం విశేషం. అందువల్ల ఇంతటి విపత్కర పరిస్థితులనూ తట్టుకుని ఈ ముగ్గురూ ముందుకు సాగుతారని స్వరూపానందేంద్ర జోస్యం చెప్పారు. ఈ ఏడాది పంటలు బాగా పండి అంతా బాగుండాలని ఆయన ఆకాంక్షించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?