Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ దర్శకులకు పిలుపు లేదు?

ఆ దర్శకులకు పిలుపు లేదు?

ఎన్టీఆర్ కు దర్శకుడు త్రివిక్రమ్ కు మధ్య వున్న బాండింగ్ తెలిసిందే. నందమూరి హరికృష్ణ మరణించినపుడు త్రివిక్రమ్ మానసికంగా అండగా నిలబడ్డారు ఎన్టీఆర్ కు. అదే విషయం స్టేజ్ మీద కూడా వెల్లడించారు ఎన్టీఆర్. 

తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కూడా ప్లానింగ్ లో వుండగానే ఆగిపోయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్-త్రివిక్రమ్ మధ్య సంబంధాలు ఎలా వున్నాయి అన్నది ఎవరికీ తెలియదు. త్రివిక్రమ్  తరువాత మహేష్ సినిమాలో బిజీ అయిపోయారు.

కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా టైమ్ వచ్చింది. ఈ సినిమా ప్రారంభోత్సవం రేపే. ఈ ఫంక్షన్ కు దిల్ రాజు, చినబాబు, నాగవంశీ, నవీన్, రవిశంకర్ లాంటి నిర్మాతలకు పిలుపు వచ్చింది. రాజ‌మౌళి-ప్రశాంత్ నీల్ లు ముఖ్య అతిధులు అని తెలుస్తోంది. సుకుమార్ ఫుల్ బిజీగా వున్నారు పుష్ప 2 టీజ‌ర్ తో. మరి ఆయనకు పిలుపు అందిందో లేదో తెలియదు. త్రివిక్రమ్ కు మాత్రం ఆహ్వానం అందరలేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

బహుశా తను పని చేస్తున్న దర్శకులను మాత్రమే పిలిచారని అనుకోవాలి. లేదా కొరటాల నే ఈ పిలుపులు చూసుకుని వుండాలి. త్రివిక్రమ్ ను పిలిస్తే బాబి, పూరి ఇలా ఇంకా చాలా మందిని పిలవాల్సి వుంటుందని వదిలేసి వుండాలేమో? ఈ ఫంక్షన్ ను వీలయినంత లిమిటెడ్ జ‌నాలతో చేయాలనుకుంటున్నారు. అదే కారణం కూడా అయి వుండొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?