Advertisement

Advertisement


Home > Politics - Andhra

అచ్చెన్న టార్గెట్ గా జగన్!

అచ్చెన్న టార్గెట్ గా జగన్!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో కొన్ని సీట్లను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భనా జరిగే భారీ సభలను ఎంచుకున్న ప్రాంతాలు చూస్తే అదే అనిపిస్తోంది. జగన్ బస్సు యాత్ర ప్రస్తుతం గోదావరి జిల్లాలలో సాగుతోంది. ఆ తరువాత తుని నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రవేశిస్తుంది.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో జగన్ తొలి సిద్ధం సభ అనకాపల్లి వేదికగా జరగనుంది అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విశాలమైన మైదానాన్ని జగన్ సభ కోసం ఎంపిక చేశారు.  అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి అభ్యర్ధిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు.

ఆయనను ఓడించాలని వైసీపీ గట్టి పట్టుదలగా ఉంది. బీజేపీ నుంచి రమేష్ పోటీ చేస్తున్నా ఆయన చంద్రబాబు రైట్ హ్యాండ్ అని బలంగా నమ్ముతోంది. ఆయన కడప నుంచి అనకాపల్లి దాకా రావడం వెనక కూడా టీడీపీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఉందని భావిస్తోంది.

దాంతో సీఎం రమేష్ ని ఓడించి పంపేలా వైసీపీ భారీ స్కెచ్ తో రెడీగా ఉంది. అందులో మొదటి ప్రయత్నంగా జగన్ భారీ సిద్ధం సభను అనకాపల్లిలో నిర్వహిస్తున్నారు. అదే విధంగా మరో కీలక నేత మీద వైసీపీ టార్గెట్ పెట్టి ఉంచింది. ఆయనే ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు.

ఆయన ఇలాకాల్లో ఈ నెల జగన్ బస్సు యాత్ర ముగింపు సభకు డిజైన్ చేశారు.  శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఈనెల 24వ తేదీన ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుందని వైసీపీ నేతలు తెలిపారు. టెక్కలిని గెలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. అందుకే ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి అక్కడ టికెట్ ఇచ్చారు. దాంతో పాటు టెక్కలిలో జగన్ బస్సు యాత్ర ముగింపు సభ అంటే చాలా కీలకంగానే భావించాలని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?