లోకేష్ ని సీఎం చేయకపోతే బాబుకు ముద్ద కూడా పెట్టరు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీని పొరపాటుగా కూడా గెలిపించవద్దని ఎన్టీయార్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ప్రజలను కోరారు. విశాఖ పర్యటనలో ఆమె పలు సంచలన కామెంట్స్ చేశారు. పొరపాటునో గ్రహపాటునో టీడీపీ గెలిస్తే మాత్రం పిచ్చోడు…

వచ్చే ఎన్నికల్లో టీడీపీని పొరపాటుగా కూడా గెలిపించవద్దని ఎన్టీయార్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ప్రజలను కోరారు. విశాఖ పర్యటనలో ఆమె పలు సంచలన కామెంట్స్ చేశారు. పొరపాటునో గ్రహపాటునో టీడీపీ గెలిస్తే మాత్రం పిచ్చోడు అయిన నారా లోకేష్ ని చంద్రబాబు సీఎం గా చేసి జనం నెత్తిన రుద్దుతాడని ఆమె హెచ్చరించారు.

నారా లోకేష్ ని సీఎం గా చేయకపోతే చంద్రబాబుకు ఇంట్లో ముద్ద కూడా పెట్టరని ఆమె బాబు ఇంటి రహస్యాన్ని కూడా గుట్టు విప్పి చెప్పేశారు. అంటే ఇంట్లో వాళ్ల వత్తిడి బాబు మీద చాలా ఉందని, టీడీపీ జనసేన కూటమి గెలిస్తే నారా లోకేష్ తప్ప ఎవరూ ముఖ్యమంత్రి కారు అని లక్ష్మీ పార్వతి అసలు విషయం చెప్పారు.

తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని ఏడున్నర పదుల ముసలివాడు అవినీతిపరుడు అయిన చంద్రబాబుని ఏపీ ప్రజలు అసలు ఎన్నుకోకూడని ఆమె సూచించారు. బాబు వస్తే ఏపీకి అధోగతే అని ఆమె జోస్యం చెప్పారు. ప్రజలకు ఎంతో మంచి చేస్తూ వారి మేలు కోసం పాటుపడుతున్న జగన్ కి వదులుకోవద్దని ఆమె రాష్ట్ర ప్రజానీకానికి అప్పీల్ చేశారు.

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని టీడీపీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీగా మార్చేశారు అని ఆమె విమర్శించారు. పవన్ కేవలం 24 సీట్లను మాత్రమే పొత్తులో భాగంగా తీసుకోవడం ద్వారా టీడీపీ మనిషిగా మారిపోయారు అని ఆమె సెటైర్లు వేశారు.

ఏపీలో వైసీపీ వచ్చాకనే పాలన సాఫీగా సాగుతోందని, విభజన ఏపీ కష్టాలు పూర్తి స్థాయిలో తీరాలంటే జగన్ మరింత కాలం సీఎం గా ఉండాల్సిందే అని ఆమె చెప్పారు. ప్రజలు కూడా తమకు మేలు చేసే వారు ఎవరో కీడు చేసే వారు ఎవరో గుర్తిస్తున్నారని అన్నారు.

ఇదిలా ఉండగా లక్ష్మీ పార్వతి టీడీపీ గెలిస్తే లోకేష్ సీఎం అంటూ చేసిన ప్రకటన మీద రాజకీయంగా హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. లోకేష్ కోసమే చంద్రబాబు ఈ వయసులో రాజకీయం చేస్తున్నారు అన్నది అంతా అనుకుంటున్నదే. అయితే టీడీపీ గెలిస్తే బాబుకు బదులుగా మొదటి రోజు నుంచే లోకేష్ ని సీఎం గా పెట్టి చంద్రబాబు పట్టాభిషేకం చేస్తారని ఆమె అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. కూటమిలో కూడా ఇవి ఆసక్తికరమైన చర్చకు తావిస్తున్నాయి.