Advertisement

Advertisement


Home > Politics - National

కుబేరుడి కొడుకు పెళ్లి.. కళ్లుచెదిరే విశేషాలు

కుబేరుడి కొడుకు పెళ్లి.. కళ్లుచెదిరే విశేషాలు

అపర కుబేరుడు ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. కొద్దిసేపటి కిందట జామ్ నగర్ లో కాక్ టైల్ పార్టీతో అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మొదలైంది. తారల తళుకులతో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులతో అంతా సందడిగా మారింది.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.

- కేవలం ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసమే 2500 రకాల వంటకాలతో మెనూ సిద్ధం చేశారు.

- ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు పాప్ గాయని రిహన్నా అంగీకరించింది. దీని కోసం ఆమెకు ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారంట.

- ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. షారూక్, సల్మాన్, రజనీకాంత్, దీపిక, రణ్వీర్, అలియా, రణబీర్, అక్షయ్ కుమార్, సైఫ్, కియరా.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ చాలా పెద్దది.

- బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బిల్ గేట్స్, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. అరబ్ దేశాలకు చెందిన కొంతమంది రాజులతో పాటు, భూటాన్ రాజ దంపతులు సైతం ఈ వేడుకలకు వచ్చారు.

- దాదాపు 2000 మంది అతిథులు ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు హాజరవుతున్నారు. చాలామంది ఈరోజు వచ్చారు. మిగతావాళ్లు రేపు, ఎల్లుండి వస్తారు.

- జామ్ నగర్ లో తగినన్ని స్టార్ హోటల్స్ లేవు. అందుకే వీళ్లందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ముకేష్ అంబానీ. ప్రతి కుటుంబానికి లగ్జరీ టెంట్ హౌజ్ లు ఏర్పాటుచేశారు. సెవెన్-స్టార్ హోటల్ సౌకర్యాలతో తాత్కాలికంగా వీటిని ఏర్పాటు చేశారు.

- పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి బంగారం, డైమాండ్స్ తో తయారుచేసిన ప్రత్యేకమైన బహుమతిని అందించబోతున్నారు.

- కొడుకు పెళ్లి కోసం ముకేష్ అంబానీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?