Advertisement

Advertisement


Home > Politics - Andhra

లోకేశ్ భ‌విష్య‌త్‌పై పంచాంగం ఏం చెప్పిందంటే!

లోకేశ్ భ‌విష్య‌త్‌పై పంచాంగం ఏం చెప్పిందంటే!

భ‌విష్య‌త్ గురించి తెలుసుకునేందుకు ప్ర‌తి ఉగాది రోజు పంచాంగం విన‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. రాజ‌కీయ పార్టీల కార్యాల‌యాల్లో పంచాంగ శ్ర‌వ‌ణం ఎలా వుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పంచాంగం చెప్పించుకునే నాయ‌కుల‌కు అనుకూలంగా జాత‌కాలు ఉన్న‌ట్టు బ్రాహ్మ‌ణులు త‌మ‌కు తోచిన రీతిలో రెండు మాట‌లు మాట్లాడి సంతృప్తి ప‌రుస్తుంటారు.

ఇవాళ మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంలో ఉగాది వేడుక‌ను పుర‌స్క‌రించుకుని వేద పండితులు చంద్ర‌బాబు, ఆ పార్టీకి చెందిన నేత‌ల స‌మ‌క్షంలో పంచాంగ శ్ర‌వ‌ణం వినిపించారు. ముఖ్యంగా లోకేశ్ గురించి ఏం చెప్పారో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే ఇంత వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న పాద‌యాత్ర చేస్తున్నారు. దీంతో లోకేశ్ భ‌విష్య‌త్ గురించి వేద‌పండితులు చెప్పిన సంగ‌తులేంటో తెలుసుకుందాం.

లోకేశ్‌కు ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు. అలాగే చంద్రుడు ఇంద్రుడై చ‌క్రం తిప్పుతా ర‌ని కూడా వేద‌పండితులు చెప్పి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏకమ‌వుతాయ‌ని వేద‌పండితులు తెలిపారు. అంటే జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య పొత్తు కుదురుతుంద‌ని టీడీపీ అనుకూల వేద‌పండితులు స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్టైంది. పంచాంగ శ్ర‌వ‌ణంతో ఆనందంలో లోకేశ్‌, చంద్ర‌బాబు గాలిలో తేలాడే ప‌రిస్థితి. 

ఇంకా గ‌తంలో మ‌ళ్లీ చంద్ర‌బాబుదే అధికారం అంటూ మాజీ ఎంపీ రాజ‌గోపాల్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. రాజ‌గోపాల్ స‌ర్వేపై అపార‌న‌మ్మ‌కంతో టీడీపీ నేత‌లు భారీ మొత్తంలో బెట్టింగ్‌లు పెట్టి పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఉగాది నాడు త‌మ‌కు అనుకూలంగా వేద‌పండితులు పంచాంగం చెప్ప‌గానే చంద్ర‌బాబు ఇదే అదునుగా తీసుకుని వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై రెచ్చిపోయి మాట్లాడ్డం గ‌మ‌నార్హం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?