Advertisement

Advertisement


Home > Politics - Andhra

సాగరతీరంలో వైసీపీ వంటకం!

సాగరతీరంలో వైసీపీ వంటకం!

వైసీపీ మేనిఫెస్టో కోసం ఒక రోజంతా అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో కసరత్తు చేశారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకులను పిలిపించుకుని చర్చించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ ని సేకరించారు.

దాదాపుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసినట్లే. విజయనగరం శ్రీకాకుళంలలో రెండు సభలు ఉన్నాయి. దాంతో బస్సు యాత్ర పూర్తి అవుతుంది. దాంతో ఉమ్మడి పదకొండు జిల్లాలలో సాగిన బస్సు యాత్రకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ని కూడా వైసీపీ అధినాయకత్వం విశాఖలో జరిగిన మీటింగులో సేకరించింది.

రానున్న రెండు రోజులల్లో ఉత్తరాంధ్రాలో మరిన్ని చేరికలు వైసీపీలో ఉన్నాయని అంటున్నారు. వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో గురించి చూస్తే ఇప్పటికే దానికి ఒక రూపకల్పన చేసారు. అని తెలుస్తోంది. తుది మెరుగులు విశాఖలో దిద్దినట్లుగా చెబుతున్నారు.

ఈ నెల 26న వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ చేస్తారు అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 23న బస్సు యాత్రలో భాగంగా ఆనందపురంలో సోషల్ మీడియా వింగ్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు అని చెబుతున్నారు. రానున్న రోజులు అతి ముఖ్యం కావడంతో సోషల్ మీడియా ద్వారా వైసీపీ వాయిస్ మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేస్తారు అని పార్టీ వర్గాలు తెలియచేశాయి.

విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో బస్సు యాత్ర జగన్ చేయబోయే ప్రసంగాల మీద అందరి దృష్టి నెలకొని ఉంది. టెక్కలిలో జగన్ చేసే ప్రసంగం మీద కూడా అంతా ఎదురుచూస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?