Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబు వెన్నుపోటుపై ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి సంచ‌ల‌న ట్వీట్‌

బాబు వెన్నుపోటుపై ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి సంచ‌ల‌న ట్వీట్‌

చంద్ర‌బాబునాయుడిని న‌మ్మి తాను మోస‌పోయాన‌ని తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. బాప‌ట్ల ఎంపీ సీటుపై ఎన్నో ఆశ‌లు పెట్ట‌కున్న శ్రీ‌దేవికి చివ‌రికి నిరాశే మిగిలింది. ఇవాళ టీడీపీ విడుద‌ల చేసిన మూడో జాబితాలో బాప‌ట్ల అభ్య‌ర్థిగా టి.కృష్ణ‌ప్ర‌సాద్ పేరు వుంది. దీంతో శ్రీదేవి తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించారు.

ఈ నేప‌థ్యంలో ఆమె చేసిన ట్వీట్ తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతోంది. ఎక్స్ వేదిక‌గా ఆమె చేసిన పోస్టు ఏంటంటే...

"రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థం అయ్యింది!!" అని ఆమె చంద్ర‌బాబుపై ప‌రోక్షంగా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ క‌త్తిని కూడా యాడ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఆమె ఓటు వేశార‌నే కార‌ణంతో వైసీపీ బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. ఆ సంద‌ర్భంలో త‌న భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను శ్రీ‌దేవి డిమాండ్ చేయ‌గా, అందుకు ఆయ‌న నిరాక‌రించారు. దీంతో ఆమె చంద్ర‌బాబుతో ట‌చ్‌లోకి వెళ్లారు.

నాడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌బ్బం గ‌డుపుకునేందుకు శ్రీ‌దేవికి చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. తాడికొండ‌, తిరువూరు అసెంబ్లీ రిజ‌ర్వ్‌డ్ స్థానాల్లో లేదా, బాప‌ట్ల ఎంపీ స్థానం నుంచి అవ‌కాశం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు వ‌ద్ద ఆమె ప్ర‌తిపాద‌న పెట్టారు. ఇస్తాన‌ని చివ‌రి వ‌ర‌కు న‌మ్మించి, ఇప్పుడు చేతులెత్తేశారు. దీంతో చంద్ర‌బాబు త‌న‌ను న‌మ్మించి వెన్నుపోటు పొడిచార‌ని శ్రీ‌దేవి ఆవేద‌న చెందుతున్నారు.

రాజ‌కీయాలు ఎలా వుంటాయో, ఎవ‌రు ఎలాంటి వారో అర్థ‌మైంద‌నే కామెంట్స్ చంద్ర‌బాబును ఉద్దేశించి చేసిన‌వే. బాబు కంటే సీఎం జ‌గ‌నే మేల‌ని ఆమె కామెంట్స్ చెప్ప‌క‌నే చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంలో త‌న అవ‌స‌రం ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాయ మాట‌లు చెప్ప‌లేద‌ని, ఇదే చంద్ర‌బాబు మాత్రం న‌మ్మించి, ఓటు వేయించుకుని, అవ‌స‌రం తీరిన త‌ర్వాత వెన్నుపోటు పొడిచార‌నే అర్థం వ‌చ్చేలా శ్రీ‌దేవి పోస్టు పెట్టార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?