Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖలో టీడీపీ కుళ్ళుబోతు రాజకీయం!!

విశాఖలో టీడీపీ కుళ్ళుబోతు రాజకీయం!!

ఓటమి భయంతోనే గోపాలపట్నంలో గల శ్రీ నూకంబిక గుడికి తాళాలు వేశారని రాజ్యసభ సభ్యులు వై వీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు, అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ముహూర్తం పెట్టుకోగా, తెలుగుదేశం కూటమి గుడికి తాళాలు వేసి ఇబ్బంది పెట్టాలని చూశార‌ని విమర్శించారు.

ఉదయం దాదాపు రెండు గంటల సేపు తాళాలు కోసం కార్యకర్తలు ఎదురు చుడాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటి రాజకీయలు చేసే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని అన్నారు.

పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అఖండ మెజార్టీ తో విజయం సాధిస్తారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.

రాజకీయంగా ఎదుర్కొలేకే దేవాలయం దగ్గర కూడ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారీఎత్తున జనం కదిలిరాగా ఆనంద్ కుమార్  నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేసారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?