Advertisement

Advertisement


Home > Politics - Andhra

అనకాపల్లి వైసీపీ ఎంపీ సీటులో భారీ మార్పు?

అనకాపల్లి వైసీపీ ఎంపీ సీటులో భారీ మార్పు?

అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో వైసీపీ చేస్తున్న కసరత్తులు ఇంకా కొనసాగుతున్నాయని అంటున్నారు. అక్కడ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ కూటమి అభ్యర్ధి సీఎం రమేష్. ఆయన అంగబలం అర్ధబలంలో గట్టిగా ఉన్నారు. అందుకే అనేక జిల్లాలను దాటుకుని మరీ ఆయనను తీసుకుని వచ్చారు.

వైసీపీ లోకల్ కార్డుతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని పోటీకి దించింది. అన్ని రకాలుగా సమర్ధుడైన నేతగా బూడి ఉన్నారు. కానీ సీఎం రమేష్ అర్ధబలం అంగబలాన్ని తట్టుకునే విషయంలోనే కొంత ఆలోచించాల్సి వస్తోంది.

దీంతో వైసీపీలో సరికొత్త ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. బూడిని తిరిగి మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్ధిగానే కొనసాగిస్తూ అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ గా కొత్తవారికి పోటీలోకి దింపాలని చూస్తోంది అని అంటున్నారు.

అనకపల్లిలో ప్రభావితమైన సామాజిక వర్గాలలో గవరలు కూడా ఉన్నారు. ఆ సామాజిక వర్గం నుంచి అసెంబ్లీకి ఎంపీకి సీటు ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీ బరిలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ ఎంపీగా వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడిని దింపింది. ఇపుడు క్యాష్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ సరిపోయేలా గవర సామాజిక వర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిని పోటీలోకి దించాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అంగబలం అర్ధబలంలో ధీటైన అభ్యర్ధిని బరిలోకి దించి బూడిని మాడుగులకు పంపిస్తే రెండు చోట్ల బంపర్ విక్టరీ కొట్టవచ్చు అని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్న క్రమంలో ఆయనను ఓడించాలంటే బూడిని అసెంబ్లీ నుంచే పోటీకి పెట్టడం సబబు అని ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఈ మార్పుల ప్రచారంలో నిజం ఎంత అన్నది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?