కరోనా ఎఫెక్ట్: మా దగ్గరకు రావద్దంటున్న లీడర్లు !

రాజకీయ నాయకుడుకి ఒక మైకూ నాలుగు బుర్రలు లేకపోతే అసలు తోచదు. గెలిచినా ఓడినా కూడా తాను  దంచే లెక్చర్లు కిక్కురుమన‌కుండా వినేందుకు జనం కావాలి. అలా వచ్చిన కార్యకర్తలకు పనులు చేయడం పక్కన…

రాజకీయ నాయకుడుకి ఒక మైకూ నాలుగు బుర్రలు లేకపోతే అసలు తోచదు. గెలిచినా ఓడినా కూడా తాను  దంచే లెక్చర్లు కిక్కురుమన‌కుండా వినేందుకు జనం కావాలి. అలా వచ్చిన కార్యకర్తలకు పనులు చేయడం పక్కన పెడితే తన గురించి గొప్పలు, అప్పజిషన్ లీడర్ మీద తిట్లూ అందుకోకపోతే ఆయన పొలిటీషియనే కాదు.

ఇంట్లో వారినైనా పక్కన పెడతారు కానీ కార్యకర్తల దర్శనం  లేకపోతే ఆ నాయకుడి బాధ వర్ణనాతీతం. అలాంటి  కార్యకర్తలను వద్దు బాబూ రావద్దు మా ఇంటికి ఈ వేళ అనేస్తున్నారు బడా లీడర్ల నుంచి చోటా లీడర్ల వరకూ ఇదే గోల. మీకు పుణ్యం  ఉంటుంది బాబ్బాబూ మా మాననా ఓ పదిరోజులు వదిలేయండ్ ప్లీజ్ అంటూ ఏకంగా పత్రికా ప్రకటనలే చేస్తున్నారు. ఎందుకిలా అంటే ఇదంతా కరోనా భయంతోనేనట.

ఎక్కడ ఏ కార్యకర్తను అంటుకుంటే ముట్టుకుంటే కరోనా సోకుతుందో, మరే పెద్ద మనిషి పనులు కావాలంటూ వచ్చి జబ్బుని అంటించిపోతాడోనని నేతాశ్రీలు హడలి చస్తున్నారు. అందుకే పార్టీ  ఆఫీసులు  కూడా మూసేసి మరీ దండం పెట్టేస్తున్నారు.

ఉత్తరాంధ్రా రాజకీయ దిగ్గజాలు ధర్మాన ప్రసాదరావు, కిల్లి క్రుపారాణి, తమ్మినేని సీతారాం వంటి వారు ఈ విధంగా భారీ స్టేట్మెంట్లు ఇచ్చి మరీ ఈ నెల 31 వరకూ తమ వద్దకు రావద్దు, వచ్చినా తాము కలిసేది లేదంటూ పక్కా క్లారిటీగా చెప్పేస్తున్నారు

వీరి బాటలోనే పచ్చ పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. ఏ రాజకీయమూ వద్దు, ఎంచక్క ఇంట్లో కూర్చోండి, కరోనా గొడవ తగ్గాక మళ్ళీ కలుద్దామంటూ ఓ పెద్ద నమస్కారం పెట్టేసి తమకు తాముగా ఏకాంతవాసాన్ని విధించుకుంటున్నారు. నిజంగా ఇది చిత్రమే. తిరిగే కాలూ తిట్టే నోరు ఎక్కడా ఆగవు అంటారు. మరి ఆ విధంగా అన్నీ మూసుకుని కూర్చోవడం అంటే యమ గండమే. కానీ అక్కడ ఉన్నది కరోనా. అందుకే ఈ  అతి జాగ్రత్తలట.

‘బిగ్‌బాస్’ ఆదేశిస్తే త‌ప్ప నోరు తెర‌వ‌రా నిమ్మ‌గ‌డ్డ‌?