Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేశినేని మీద పీవీపీ దాడి వెనుక?

కేశినేని మీద పీవీపీ దాడి వెనుక?

వైకాపా నాయకుడు పి వి పి...ఇలా అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఎందుకంటే చాలా కాలంగా వైకాపా కు దూరంగా వుంటూ వస్తున్నారు. మరోసారి పోటీ చేసే ఆలోచనలో కూడా వున్నట్లు కనిపించడం లేదు. కానీ అప్పుడప్పుడు ట్విట్టర్ పరోక్షంగా, అన్యాపదేశంగా జగన్ కు సుద్దులు చెబుతున్నట్లు, చిన్నగా హెచ్చరిస్తున్నట్లు ట్వీట్ లు పెడుతుంటారు. కానీ ఏ రోజూ గీత దాటి భాష వాడడం కానీ, శృతి మించిన ట్వీట్ లు వేయడం కానీ చేయలేదు.

కానీ ఈ రోజు పివిపి వేసిన ట్వీట్ వేరు. ఆ ఘాటు వేరు. టార్గెట్ వేరు అన్నట్లు వుంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే..

‘’..నీ బిల్డప్ ఏందయ్యా kesineni_nani నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని,జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు!!..’’

కేశినేని నానిని ఎందుకు మాటలతో అటాక్ చేయాల్సి వచ్చిందో అన్నది పెద్ద ప్రశ్న. చేస్తే చేసారు బ్యాంక్ రుణాల ప్రస్తావన చేసారు పివిపి. ఈ విషయంలో పివిపి మీద కూడా కొన్ని విమర్శలు వున్నాయి. పైగా పర్సనల్ అటాక్ కూడా చేసారు. కొవ్వు కరిగించే పనిలో వుండు అంటూ. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్యద్ధంలో వైకాపా మనిషి పివిపి ఎందుకు కలుగచేసుకోవాల్సి వచ్చిందో?

కొంపదీసి తేదేపా టికెట్ మీద పివిపి బరిలో దిగే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఏమో? రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?