Advertisement

Advertisement


Home > Politics - Gossip

మీడియాకు మనుషులు కావలెను

మీడియాకు మనుషులు కావలెను

మీడియా నేరుగా తిడితే మహా అయితే ఒకటి రెండు సార్లు తిట్టొచ్చు. కానీ నిత్యం అదే తిట్ల యజ్ఞం నిర్వహించాలంటే ఎవరో ఒకరు దొరకాలి. 

మన భావనలు, మన మాటలు వారి నోట పలికించాలి. అదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆ విధంగా జగన్ ను తిట్టడానికి టూల్ మాదిరిగా ఉపయోగపడిన నాయకుడు సబ్బం హరి.

ఈ రోజు ఓ ఛానెల్ రేపు ఇంకో ఛానెల్..ఈ రోజు మాకు..రేపు మీకు అన్నట్లు పంచుకున్నారు. జగన్ ను తిట్టుట. దానిని ప్రసారం చేయుట. కానీ పాపం, కాలం కాటేసింది. 

హరి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హరిని ఆ విధంగా వాడుకున్న పార్టీ నాయకులు విశాఖ వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు. పాపం, హరి కొడుకు భవిష్యత్ ఏమిటి? అన్నది ఎవ్వరికీ తెలియదు. పట్టదు.

ఇక ఆర్ఆర్ఆర్ అలియాస్ రఘురామ్ గురించి తెలిసిందే. ఆ వ్యవహారాలే ఇంత వరకు తెచ్చాయి. జైలుకు పంపాయి. కోర్టుకు ఈడ్చాయి. గుట్టుగా ఇంట్లో వుండే ఇల్లాలిని సైతం ఢిల్లీలో పెద్దల ఇళ్లకు వెళ్లి బతిమాలుకునేలా చేసాయి. ఇప్పుడు ఆయనను కూడా మీడియాకు దూరంగా వుండమన్నది కోర్టు.

ఇక మరి ఇప్పుడు ఎవరు? ఆ రెండు ఛానెళ్లకు సాయంత్రం వేళ పేరంటం పెట్టడానికి పెద్ద ముత్తయిదువుగా ఎవరు వస్తారు? తెలుగుదేశం సీనియర్లు అంతా తెలివైన వారు అమావాస్యకు, పున్నానికి ఓ స్టేట్ మెంట్ పడేస్తారు తప్ప ఇలాంటి వ్యవహారాల జోలికి పోరు. 

కాంగ్రెస్ లేదా చిన్న చితక నాయకులు ఎవరైనా మళ్లీ రంగంలోకి దిగాలి. కానీ ఆర్ఆర్ఆర్ వ్యవహారం చూసాక అంత ధైర్యం చేస్తారా? ఏమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?