Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆయ‌న‌కే!

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆయ‌న‌కే!

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌పై చంద్ర‌బాబు అన‌ధికారికంగా క్లారిటీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. టీడీపీ ఇన్‌చార్జ్ ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డినే బ‌రిలో దింపాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ప్ర‌వీణ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి వుంది.  

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్రొద్దుటూరు టికెట్ విష‌య‌మై ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య డైలాగ్ వార్ న‌డుస్తోంది. టికెట్ త‌మ‌కంటే త‌మ‌క‌ని మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి, ప్ర‌వీణ్‌రెడ్డి, లింగారెడ్డి, సీఎం సురేష్‌నాయుడు ఎవ‌రికి వారుగా ప్ర‌క‌టించుకున్నారు. మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, ప్రొద్దుటూరులో త‌మ‌కే బ‌లం ఉంద‌ని, తామైతేనే గెలుస్తామ‌ని వెల్ల‌డించారు. టీడీపీలోని ఇత‌ర నేత‌లు చెబుతున్న‌ట్టు వారికి టికెట్ ఇవ్వ‌ర‌ని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్నారు.

లింగారెడ్డి మాట‌ల‌కు ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ప్రొద్దుటూరు టికెట్ త‌న‌కే అని, ఒక‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అప్పీల్ చేశారు. పార్టీ బ‌లోపేతానికి నాలుగేళ్ల‌కు పైగా తాను క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని, జైలుపాలు అయ్యాన‌ని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఇటీవ‌ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గ‌మంతా క‌లియ‌తిరుగుతూ త‌న‌కే టికెట్ ఇస్తార‌ని, ఆద‌రించాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌వీణ్‌ను విజ‌య‌వాడ‌కు పిలిపించున్న చంద్ర‌బాబు.... ప్రొద్దుటూరు రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్ర‌వీణ్‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి, గెలుచుకుని రావాల‌ని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించి పంపార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. త్వ‌ర‌లో ప్రొద్దుటూరు టికెట్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌వీణ్‌కే టికెట్ ఇవ్వ‌డం వెనుక లోకేశ్ ప్రోద్బ‌లం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?