ఎలాగైనా మార్చి 31వ తేదీ నాటికి ఏపీలో స్థానిక ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల జరగాలంటే ఈ నెల 31 నాటికి స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో .. ఈ మేరకు స్థానిక ఎన్నికల తేదీలను ప్రభుత్వం ప్రకటించనుందని తెలుస్తోంది.
ఈ నెల 21వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉండవచ్చని, ఆ తర్వాత మూడు రోజులకే అంటే మార్చి 24న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుందని సమాచారం. ఆపై 27వ తేదీన ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోందని తెలుస్తోంది. ఈ మూడు ఎన్నికల ఫలితాలూ.. మార్చి 31వ తేదీ లోపున విడుదల అయ్యే అవకాశాలున్నాయి.
ఈ తేదీలకే స్థానిక ఎన్నికల పోలింగ్ నిర్వహణను ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహరణకు తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ ప్రకటించారు. మొత్తానికి ఇక పెద్దగా గ్యాప్ లేకుండానే వరసగా ఎన్నికలు జరగబోతున్నట్టుగా స్పష్టం అవుతూ ఉంది.