ఘోర ప్రమాదం.. 25 మంది స‌జీవ ద‌హ‌నం!

మహారాష్ట్రలో జ‌రిగిన ఘోర బ‌స్సు ప్ర‌మాదం తీవ్ర విషాద‌న్ని నింపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 25 మంది మృతి చెందారు.  Advertisement ప్రైవేటు బస్సు 32 మంది ప్రయాణికులతో నాగ్‌పూర్…

మహారాష్ట్రలో జ‌రిగిన ఘోర బ‌స్సు ప్ర‌మాదం తీవ్ర విషాద‌న్ని నింపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 25 మంది మృతి చెందారు. 

ప్రైవేటు బస్సు 32 మంది ప్రయాణికులతో నాగ్‌పూర్ నుంచి పూణె వైపు వెళ్తుండగా బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వే పై టైర్లు పేలడంతో బోల్తా పడింది. బస్సు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగి బస్సులోని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 

బస్సులో మంటలు వ్యాపించినపుడు 32 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్ర‌మాదం తెల్ల‌వారు జామును జ‌ర‌గ‌డంతో గాఢ నిద్ర‌లో ఉన్న ప్ర‌యాణికులు ఉల్కికిప‌డి లేచి చేసేస‌రికే చుట్టూ మంట‌లు వ్యాపించాయి.