అమ్మ కోసం వెదుకుతుంటే, మృతదేహం ఫొటో..!

ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం, వందలాంది కుటుంబాలకు కడుపుకోత మిగిల్చింది. సోదరుల్ని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని కోల్పోయిన కుటుంబాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. ఇక కాళ్లు, చేతులు, కంటిచూపు పోగొట్టుకున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. Advertisement…

ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం, వందలాంది కుటుంబాలకు కడుపుకోత మిగిల్చింది. సోదరుల్ని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని కోల్పోయిన కుటుంబాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. ఇక కాళ్లు, చేతులు, కంటిచూపు పోగొట్టుకున్న వాళ్లు వేలల్లో ఉన్నారు.

ఒరిస్సాకు చెందిన సూర్యవీర్ తల్లి, అమ్మమ్మ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీకి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తెచ్చుకోవాలనుకున్నారు. అయితే అంతలోనే పెను ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సూర్యవీర్, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాడు.

అతడికి తల్లి జాడ తెలియలేదు. కొన్ని గంటల తర్వాత అమ్మమ్మ మాత్రం కనిపించింది. ఇక లాభం లేదని గ్రహించిన సూర్యవీర్, తన తల్లి ఫొటోను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. ట్రెయిన్ ఎక్కినప్పుడు ఆమె ధరించిన చీర రంగును కూడా పేర్కొన్నాడు.

తన తల్లి కనిపిస్తే, వెంటనే సమాచారం ఇవ్వాలని అందులో తన ఫోన్ నంబర్ కూడా యాడ్ చేశాడు. ఓవైపు తను వెదుకుతూనే, మరోవైపు సోషల్ మీడియా ద్వారా తల్లి ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేశాడు. అమ్మమ్మ బతికుంది కాబట్టి, తల్లి కూడా ఎక్కడో తప్పిపోయి ఉంటుందనేది సూర్యవీర్ ఆశ.

కానీ అతడి ఆశలు అడియాశలయ్యాయి. సూర్యవీర్ తల్లి ఆ ప్రమాదంలో మరణించింది. ఎవరో ఓ వాట్సాప్ యూజర్, తల్లి చనిపోయిన ఫొటోను అతడికి వాట్సాప్ చేశాడు. విగతజీవిగా పడి ఉన్న తల్లి ఫొటోను చూసి సూర్యవీర్ చలించిపోయాడు.

బాధాకరమైన విషయం ఏంటంటే.. తల్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు, వాట్సాప్ యూజర్ చెప్పిన స్థలానికి వెళ్లిన సూర్యవీర్ కు, అక్కడ తల్లి భౌతికకాయం కనిపించలేదు. దీంతో అతడి బాధ వర్ణనాతీతం.