Advertisement

Advertisement


Home > Politics - Political News

సామాజిక సేవలోనూ మేఘా ముందంజ!

సామాజిక సేవలోనూ మేఘా ముందంజ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న మేఘ ఇంజనీరింగ్ (ఎంఇఐఎల్) సామాజికసేవ కూడా తన బాధ్యతగా పరిగణించి ఇరు రాష్ట్రాల్లో అనేక గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోంది. దేశంలో పలుచోట్ల ఆసుపత్రుల్లో రోగులకు, వారి బంధువులకు కూడా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నది. కేన్సర్ బారినిపడి బ్రతుకు ప్రశ్నార్థకం అయిన బాలబాలికలను కూడా తన సంరక్షణ ఖాతాలో వేసుకుంది. వారికీ కూడా మధ్యన భోజనం ఉచితంగా అందిస్తున్నది. హైదరాబాద్లోని నిమ్స్ లో క్యాన్సర్ బాధితుల కోసం అత్యధునాతన సదుపాయాలతో ఒక పెద్ద భవంతిని నిర్మించి ఇచ్చింది. మార్కెట్ యార్డులో రైతుల ఆకలి తీర్చే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని జములపల్లిని దత్తత తీసుకున్న ఎంఇఐఎల్ గ్రామంలో 40, 20 వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించి, ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నది. ఈ పథకంలో ఫెరల్ అనే ఆత్యాధునిక టెక్నాలజీని వాడింది. దీని ద్వారా ప్రతి ఇంటికీ ఒకే ప్రెషర్ తో తాగునీరు వస్తుంది. జములపల్లిలో 12 కేవీ సోలార్ ప్లాంట్ తోపాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్ లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది.

కృష్ణాజిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్.. రెండు గ్రామాల్లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రు గ్రామంలో కళ్యాణ మండపం, దేవాలయం నిర్మించింది. మరుగుదొడ్లను, వీధుల్లో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. ఇదే గ్రామంలో రహదారులను ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ఎంఇఐఎల్. ఖాజా గ్రామంలో తాగునీటి కష్టాలను దూరం చేయడంతోపాటు రహదారులను ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలతోపాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన ఎంఇఐఎల్.

ఇలా ప్రతీ ఏటా దాదాపు 10 లక్షల మంది ఆకలిని భోజనామృత ద్వారా తీరుస్తున్నది మేఘా ఇంజనీరింగ్.  హైదరాబాద్ లోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న మేఘా. హైదరాబాద్ లోని ప్రాణం ఫౌండేషన్ కు చెందిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఎంఇఐఎల్ బాసటగా నిలుస్తూ, వారికి వైద్యం అందిస్తున్నది. వరంగల్ నగరంలో న్యూలైఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన హెచ్ఐవీ బాధిత చిన్నారులకు భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. సద్దిమూట కార్యక్రమం ద్వారా సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలిని తీరుస్తున్న ఎంఇఐఎల్.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?