Advertisement

Advertisement


Home > Politics - Political News

దారుణం.. లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య

దారుణం.. లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య

కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పాల్వంచలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 43 ఏళ్ల వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎన్ని చట్టాలు చేసినా మహిళలకు రక్షణ లేకుండా పోతోందనడానికి మరో ఉదాహరణగా నిలిచింది ఈ ఘటన.

పాల్వంచలో నివశిస్తున్న 43 ఏళ్ల వివాహితది వ్యవసాయ కూలీ కుటుంబం. భర్త, ఇద్దరు పిల్లలతో సంసారం సాగిస్తోంది. ఒకరోజు అదే ప్రాంతానికి చెందిన మధు అనే 21 ఏళ్ల వ్యక్తి.. వివాహిత బాత్రూమ్ వీడియోను రహస్యంగా చిత్రీకరించాడు. తన కోరిక తీర్చాలని, లేదంటే ఆ వీడియో బయటపెడతానని బెదిరించాడు. ప్రారంభంలో ఈ వేధింపుల్ని మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. పెద్దల ముందు పంచాయితీ కూడా పెట్టింది.

కొన్నాళ్లకు మధు, మళ్లీ ఆ మహిళను వేధించడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే భర్త, పిల్లల్ని చంపేస్తానని బెదిరించి కోరిక తీర్చుకున్నాడు. ఆ వీడియోను కూడా రహస్యంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో మహిళ ఈసారి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.

విషయం తెలుసుకున్న మధు, అతడి తల్లిదండ్రులు బాధిత మహిళ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. కుటుంబాన్ని రకరకాల మాటలన్నారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ, పురుగుల మందు తాగింది. వెంటనే కొత్తగూడెం హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిన్న ఆమె మరణించింది.

ప్రస్తుతం మధు, అతడి తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?