బాబూ నాశ‌న‌మై పోతావ‌న‌డం ఒక్క‌టే త‌క్కువ‌

టీడీపీలో లోకేశ్ ఎలాగైతే ట్విట‌ర్‌లో యాక్టీవ్‌గా ఉంటారో, వైసీపీలో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల‌పై సెటైర్లు వేస్తుంటాడు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు, లోకేశ్‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే…

టీడీపీలో లోకేశ్ ఎలాగైతే ట్విట‌ర్‌లో యాక్టీవ్‌గా ఉంటారో, వైసీపీలో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల‌పై సెటైర్లు వేస్తుంటాడు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు, లోకేశ్‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే విజ‌య‌సాయిరెడ్డికి విప‌రీత‌మైన కోపం. ఈ ముగ్గురిపై ట్విట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు.

తాజాగా ఆయ‌న చంద్ర‌బాబుపై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ‘బాబూ నువ్వు నాశ‌న‌మై పోతావ్’ అని  శాప‌నార్థాలు పెట్ట‌డం ఒక్క‌టే త‌క్కువ‌. అంటే అంత‌గా బాబు వైఖ‌రిపై విజ‌య‌సాయి ఫైర్ అయ్యాడు. క‌రోనా వైర‌స్‌ను సాకుగా చూపి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం స‌రైన నిర్ణ‌య‌మ‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డంపై విజ‌య‌సాయి తీవ్రంగా స్పందించాడు.

బాబుపై విజ‌య‌సాయి ట్విట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

‘పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది వీళ్ల వ్యవహారం. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో!. స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి చంద్రబాబు గెలిచినట్టు ఫీలవుతున్నారు. ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ. నాయకులు పార్టీ వీడిపోతుంటే ఈ దిక్కుమాలిన పనికి ఒడిగట్టావు. నీ కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో బాబుపై సుతిమెత్త‌గా ఘాటైన వ్యాఖ్య‌లు చేశాడు.

తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా

ఈ జాగ్రత్తలు తీసుకోండి