బ్రేకింగ్: ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ స్కెచ్‌!

తెలుగు రాష్ట్రాల్లో సంచల‌నం సృష్టించిన ఓటుకు నోటు గుర్తుకు తెస్తూ ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనేందుకు చేసిన ఒక‌ కుట్ర కోణం బ‌య‌టి వ‌చ్చింది. మొయినాబాద్​ లోని పైలట్​ రోహిత్​రెడ్డికి చెందిన ఫాం హౌస్​లో…

తెలుగు రాష్ట్రాల్లో సంచల‌నం సృష్టించిన ఓటుకు నోటు గుర్తుకు తెస్తూ ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనేందుకు చేసిన ఒక‌ కుట్ర కోణం బ‌య‌టి వ‌చ్చింది. మొయినాబాద్​ లోని పైలట్​ రోహిత్​రెడ్డికి చెందిన ఫాం హౌస్​లో న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను ఒక స్వామిజీ వారిని కోనేందుకు 100 కోట్ల రూపాయిలు ఆఫర్ చేసిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, పైల‌ట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావుల‌ను ప్ర‌లోభ పెట్టి త‌లా 100 కోట్ల రూపాయ‌ల‌ను అఫ‌ర్ చేసి పార్టీ ఫిరాయించేలా మంత‌నాలు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వారితో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్వ‌యన ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో పోలీసులు రైడ్ చేసి వారి వ‌ద్ద నుండి దాదాపు రూ.15 కోట్లపైగా నగదును పోలీసులు సీజ్ చేసిన‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. ఎమ్మెల్యేలతో బేరసారాల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర అన్నారు.

మొత్తానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ‌తంలో రేవంత్ రెడ్డిని ఇరికించిన‌ట్లే కొనుగొలుకు వ‌చ్చిన స్వామిజీల‌ను భ‌లే ఇరికించారు. ఈ కొనుగోలు వ్య‌వ‌హ‌రంపై టీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.