సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా నగరంలో నాలాలు పొంగి పొర్లుతుండగా… కళాసిగూడలో నాలాలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఇవాళ ఉదయం పాల ప్యాకెట్ కోసం ఇంటి నుండి బయటకొచ్చిన చిన్నారి ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోగా.. పాప డెడ్ బాడీని పార్క్ లైన్ దగ్గర గుర్తించారు.
పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్లిన చిన్నారి ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. చివరికి పాప నాలాలో పడి మృతి చెందిన విషయం తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గతంలో కూడా హైదరాబాద్ నగరంలో నాలాలో పడి చాలా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వరుస ప్రమాదలు జరుగుతున్న రాజకీయ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి సామన్య ప్రజలు బలి అవుతునే ఉన్నాయి.