సుఖేష్ లేఖ‌.. కేటీఆర్ కౌంట‌ర్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ సైలెంట్‌గా ఉన్న మనీలాండ‌రింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మాత్రం వదలడం లేదు. తాజాగా తనను కేటీఆర్, కవితలు బెదిరిస్తున్నారంటూ తెలంగాణ…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ సైలెంట్‌గా ఉన్న మనీలాండ‌రింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మాత్రం వదలడం లేదు. తాజాగా తనను కేటీఆర్, కవితలు బెదిరిస్తున్నారంటూ తెలంగాణ గవర్నర్‌కు జైలు నుండే లేఖ రాశారు.

త‌న వ‌ద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాల‌ని క‌విత‌, కేటీఆర్ స‌న్నిహితులు త‌న‌ను ఒత్తిడి తెస్తున్న‌ర‌ని.. వారికి వ్య‌తిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ల‌లోని ఆధారాలు ఇవ్వాల‌ని అడుగుతున్నార‌ని.. అవి ఇస్తే రూ. 100కోట్ల న‌గ‌దు, శంషాబాద్ వ‌ద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశారు.

దాదాపు రూ. 2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని.. తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందని.. ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65- బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చానని, కవిత నుంచి రూ. 15 కోట్లు తీసుకొని కేజీవాల్ తరపు వారికి ఇచ్చానని.. వాటిపై సీబీఐ ద‌ర్యాప్తు కోరుతున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

కాగా సుఖేష్ ఆరోప‌ణ‌ల‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. సుఖేష్ గురించి తానెప్పుడూ విన‌లేద‌ని.. ఓ నేర‌స్థుడు త‌న‌పై చేసిన మ‌తిలేని ఆరోప‌ణ‌లు మీడియా ద్వారా త‌న దృష్టికి వ‌చ్చాయ‌న్నారు. సుఖేష్‌పై న్యాయ‌ప‌రంగా గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటానని హెచ్చరించారు. అలాంటి వాడు చేసిన ఆరోప‌ణ‌లు మీడియాలో ప్ర‌సారం చేసే ముందు ఆలోచించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.