
హైదరాబాద్ నగరంలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా 25 ఏళ్ల వయసులోపే వారిగా తెలుస్తోంది.
గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ప్రమాదం జరిగింది. ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. ఐదో అంతస్తులోని ఆరుగురు సిబ్బంది.. అగ్నికి తాళలేక ఓ రూమ్లోకి వెళ్లి దాక్కున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లే సరికి.. వాళ్లంతా రూమ్లో స్పృహ తప్పిపడిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పొగకు ఊపిరాడక చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు.
ఆగ్ని ప్రమాదానికి గురైన స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఫైర్ సేప్టీ రూల్స్ పాటించలేదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ హెచ్చరించారు. ప్రమాదంలో బిల్డింగ్ స్ట్రక్చర్ దెబ్బతిన్నట్లు వెల్లడించారు. భవనాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాత కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామన్నారు.