Advertisement

Advertisement


Home > Politics - Telangana

గ్రూప్ 1 పేప‌ర్ కూడా లీక్ అయ్యిందా?

గ్రూప్ 1 పేప‌ర్ కూడా లీక్ అయ్యిందా?

టీఎస్‌పీఎస్‌సీ పోటీ ప‌రీక్ష‌ల ప్రశ్నాపత్రాల వ్యహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ ప్రశ్నాపత్రం లీక్‌తో మొదలైన ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.

ఇప్ప‌టికే ఏఈ ప‌రీక్ష పేప‌ర్ లీక్ కాగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేప‌ర్ కూడా బ‌య‌టికెళ్లిన‌ట్లు అనుమానాలు చెల‌రేగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌ 16న జరిగిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రాన్ని సైతం ప్రవీణ్ లీక్‌ చేశాడాన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

నిందితుడు ప్ర‌వీణ్ గ్రూప్ 1 ప‌రీక్ష రాసిన‌ట్లు తెలిస్తోంది. అత‌డు రాసిన పేప‌ర్ ను అధికారులు వెరిఫై చేస్తున్నారు. గ‌త సంవ‌త్స‌రం ఆక్టోబ‌ర్ 16న 503 గ్రూప్ 1 పోస్టుల భ‌ర్తీకి ప‌రీక్ష నిర్వ‌హించ‌గా, 1:50 నిష్ప‌త్తిలో 25, 150 మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు.

ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తూ ప్రవీణ్ చేసిన త‌ప్పుల‌కు లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా గ్రూప్‌ 1 అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేయాల్సి వస్తుందా అనే అనుమానం తలెత్తుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?