విశాఖ ఎంతెంత దూరం అంటే దగ్గరే అన్న మాట ఇపుడు వినిపిస్తోంది. చాలా డౌట్లకు విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు చెక్ పెట్టనున్నాయి అని అంటున్నారు. విశాఖ మేయర్ పీఠం కచ్చితంగా వైసీపీకి దక్కుతుంది అన్న అభిప్రాయం గట్టిగానే బలపడుతోంది.
మరి కొద్ది గంటలలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో అటు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు, ఇటు అభ్యర్ధులలోనూ టెన్షన్ టాప్ లెవెల్ లో ఉంది. దాంతో 98 వార్డులు ఉన్న విశాఖలో మ్యాజిక్ ఫిగర్ 50 సీట్లను గెలుచుకుంటుంది అని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.
వైసీపీ గెలిస్తే ఏమవుతుంది అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. విశాఖలో మేయర్ పీఠం వైసీపీకి దఖలు పడిన మరుక్షణం విశాఖ రాజధానికి రంగం సిద్ధం అయినట్లేనని అంటున్నారు. మూడు రాజధానుల అంశం కోర్టులో ఉన్నందువల్ల ఆ తీర్పు మేరకు నిర్ణయం వెలువడుతుంది.
అదే సమయంలో జగన్ సీఎంగా విశాఖ లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి పాలించేందుకు ఆటంకాలు ఎదురుకాబోవు అంటున్నారు. మొత్తానికి విశాఖ మేయర్ పీఠం వైసీపీని వరిస్తే రాజధానికి ప్రజల ఆమోదం దక్కినట్లే అంటున్నారు.