క్రిస్మస్ కు పుట్టింటికి పంపించలేదని ఆత్మహత్య

క్రిస్మస్ కు పుట్టింటికి పంపించలేదని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే.. తను మాత్రమే చనిపోలేదు, తనతో పాటు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల్ని కూడా తనతో తీసుకెళ్లిపోయింది.…

క్రిస్మస్ కు పుట్టింటికి పంపించలేదని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే.. తను మాత్రమే చనిపోలేదు, తనతో పాటు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల్ని కూడా తనతో తీసుకెళ్లిపోయింది. సికింద్రాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

నగరంలోని జవహర్ నగర్ ప్రాంతంలో భర్తతో కలిసి నివశిస్తోంది నాగమణి. ఆ దంపతులకు ఐదేళ్ల వయసు, 8 నెలల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. క్రిస్మస్ కు పుట్టింటికి వెళ్తానని భర్తను కోరింది నాగమణి. పండగ తర్వాత వెళ్లొచ్చని భార్యకు సర్దిచెప్పాడు భర్త.

కానీ భార్య మాత్రం పండక్కి ఊరు వెళ్లనందుకు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. రాత్రి అయినా భార్య-పిల్లలు ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు భర్త. ఈలోగా అదే ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో మూడు మృతదేహాలు బయటపడ్డాయనే సమాచారం అందింది.

పోలీసులతో పాటు వెళ్లిన భర్త.. ఆ మృతదేహాల్ని తన భార్య-పిల్లలవిగా గుర్తించాడు. వెలికితీసిన మృతదేహాల్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమా.. ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా ?