ప్రేయసితో పాటు ప్రియుడు ఆత్మాహుతి

నిజమైన ప్రేమలే లేని ఈ కాలంలో అమర ప్రేమికులు కూడా ఉంటారా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. సోషల్ మీడియాలో ప్రేమించుకొని ఓయో రూమ్స్ లో అదే ప్రేమను చల్లార్చుకునే జంటలే ఎక్కువగా…

నిజమైన ప్రేమలే లేని ఈ కాలంలో అమర ప్రేమికులు కూడా ఉంటారా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. సోషల్ మీడియాలో ప్రేమించుకొని ఓయో రూమ్స్ లో అదే ప్రేమను చల్లార్చుకునే జంటలే ఎక్కువగా కనిపిస్తున్న ఈ రోజుల్లో.. ప్రేయసితో పాటు ప్రియుడు కూడా తనువు చాలించిన ఘటన తమిళనాడులో జరిగింది. ప్రేయసి చితిపైకి తను కూడా వెళ్లి ఆత్మాహుతి చేసుకున్నాడు ఈ ప్రియుడు.

కళ్లకురిచ్చి జిల్లా ఉళ్లందూర్ పేటకు చెందిన ఓ రైతుకు ముగ్గురు అమ్మాయిలు. అందులో పెద్దమ్మాయి నిత్యశ్రీ నర్సింగ్ చదువుతోంది. లాక్ డౌన్ వల్ల ఆన్ లైన్ లోనే క్లాసులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లంతా ఆన్ లైన్లోనే క్లాసులకు హాజరవుతున్నారు. అయితే ఇంట్లో ఒకే ఫోన్ ఉండడంతో ఓసారి పెద్ద గొడవ జరిగింది.

మనస్తాపానికి గురైన నిత్యశ్రీ క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ లో 2 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. అదే రోజు మృతదేహాన్ని స్వగ్రామంలో దహనం చేశారు.

ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే నిత్యశ్రీ మృతదేహం దహనం అవుతున్న సమయంలో.. రాత్రి వేళ.. అదే చితిపై మరో వ్యక్తి కూడా తన ప్రాణాలు తీసుకున్నాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది.

పక్క గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి  కనిపించడం లేదని అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యశ్రీ చనిపోయిన రోజు శ్మశానంలో రాముని చూశామని.. నిత్యశ్రీని రాము ఆరాధిస్తున్నాడని అతడి స్నేహితులు చెప్పడంతో పోలీసులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.

నిత్యశ్రీని దహనం చేసిన చితి నుంచి సెల్ ఫోన్, వాచీ విడిభాగాలతో పాటు కొన్ని ఎముకల్ని సేకరించి ఫోరెన్సిక్ కు పంపించారు. అలా తను ప్రేమించిన అమ్మాయి కోసం, రాము ఏకంగా చితిలో దూకి తన ప్రాణాలు కూడా త్యాగంచేశాడు.

భగవద్గీత వల్లిస్తే చాలదు.. బాణం పట్టాలి

వీడు అక్కయ్య వాడు అన్నయ్య