Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్-వంశీ సినిమాకు బ్రేక్?

అఖిల్-వంశీ సినిమాకు బ్రేక్?

అక్కినేని అఖిల్ తొలి సినిమాను భారీగా ప్లాన్ చేసి అందించారు. అది కాస్తా టప్.. మని బుడగలా పేలిపోయింది. అప్పటి నుంచి అఖిల్ తండ్రి, హీరో నాగ్ సరైన సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రెండో ప్రాజెక్ట్ కచ్చితంగా హిట్ కొట్టి తీరాలి. కళ్యాణ్ కృష్ణ అనుకున్నారు..కానీ అఖిల్ నో అన్నాడు. సంపత్ నంది పేరు వినిపించింది కానీ మళ్లీ ఏమయిందో తెలియదు. 

ఊపిరి సినిమా చేస్తుంటే నాగార్జునకు వంశీ పైడిపల్లి తెగ నచ్చేసాడు. అందుకే అఖిల్ రెండో సినిమా వంశీ పైడిపల్లితో అని ఫిక్స్ అయిపోయాడు. వంశీ కథ రెడీ చేస్తున్నారని వార్తలు కూడా వినవచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా డ్రాప్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కారణం అని తెలుస్తోంది. 

వంశీ రెడీ చేస్తున్న సబ్జెక్ట్ కు సుమారు 40 కోట్లు అవసరం అవుతాయని తెలుస్తోంది. మళ్లీ మరోసారి అఖిల్ మీద 40 కోట్లు ఎవరు పెడతారు. నాగ్ అయితే సమస్యే లేదు.. ఆయన తన మీదే అంత ఖర్చు చేయరు. తొలి సినిమాకు ఇలా నలభై పెట్టే నితిన్ ఫ్యామిలీ కిందా మీదా అయింది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మరి ఎవరు వస్తారు? 

అఖిల్ కు వున్న బ్యాక్ గ్రౌండ్ ప్రకారం పాతిక కోట్లు అయితే సేఫ్ బెట్. అందుకే వంశీ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడిపోయినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?