Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబుకే షాక్ ఇచ్చిన టీడీపీ నేత!

బాబుకే షాక్ ఇచ్చిన టీడీపీ నేత!

గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగా అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించారు అనుకుంటే నామినేషన్ల పర్వం మొదలైన తరువాత కూడా ఇంకా మార్పులూ చేర్పులూ చేస్తూ టీడీపీ తనదైన పాత ట్రెండ్ ని కంటిన్యూ చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల సీటులో కూడా టీడీపీ అభ్యర్ధిని మారుస్తారు అని ప్రచారం సాగింది.

ఇపుడు అదే నిజం అయింది. పెందుర్తి టికెట్ దక్కనందుకు రాజకీయ రచ్చ చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని మాడుగులకు పంపిస్తున్నారు. ఆయనకు ఆ టికెట్ ఇస్తున్నారు. ఆ విషయం బండారు స్వయంగా ప్రకటించారు.

అయితే చాలా రోజుల క్రితమే మాడుగుల టీడీపీ టికెట్ దక్కించుకున్న ఎన్నారై పైలా ప్రసాదరావు మాత్రం ఈ విషయాలు ఏవీ తెలియనట్లుగానే తాను అనుకున్న ముహూర్తానికి నామినేషన్ వేసేశారు. ఆయన శుక్రవారం టీడీపీ జెండాలతో జనాలతో అంగరంగ వైభవంగా సందడి చేస్తూ మాడుగుల టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

తమ్ముళ్ళకు అయితే అసలు ఏమీ అర్ధం కావడంలేదు. మాడుగులకు ఇద్దరు అభ్యర్ధులా అని వారు విస్తుబోతున్నారు. నెల రోజులుగా పైలా ప్రసాదరావు వెంట తిరిగిన వారు ఇపుడు బండారు వెంట కనిపిస్తున్నారు. బండారు తనకే టికెట్ అంటున్నారు. పైలా కూడా ఏమీ తగ్గడం లేదు. దానిని బట్టి బీ ఫారం ఎవరికి ఇచ్చిన పైలా తాను రంగంలో ఉంటాను అని చెప్పకనే చెప్పేస్తున్నారు అన్న మాట. ఆ విధంగా బాబుకే షాక్ ఇచ్చేందుకు పైలా రెడీ అయిపోయారు అంటున్నారు.

అసలే మాడుగులలో రెండు సార్లు ఓటమి పాలు అయి వర్గ పోరుతో సతమతం అవుతున్న టీడీపీకి రిపేర్లు చేయాల్సింది పోయి నాలుగవ క్రిష్ణుడిగా బండారుని దించారు అని పార్టీ శ్రేణులు మధన పడుతున్నారు. బండారు పోటీ చేసినా పైలా ఓట్లను చీలిస్తే సైకిల్ కే పంక్చర్ అవుతుంది అని అంటున్నారు. పైలా నామినేషన్ వేశారు ఆయన చేత విత్ డ్రా చేయిస్తారా లేక ఆయన పంతం పట్టి రెబెల్ గా ఉంటారా అన్నది మాత్రం పసుపు పార్టీలో అంతా చర్చించుకున్న విషయంగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?