Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘మెగా’ ముహూర్తం రెడీ అయినట్టే.!

‘మెగా’ ముహూర్తం రెడీ అయినట్టే.!

రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మళ్ళీ మెగాస్టార్‌గా తెలుగు తెరపై వెలిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిగో అదిగో.. అంటూ ఆరేళ్ళపాటు సినీ రంగానికి దూరమైన చిరంజీవి, ఈసారి పక్కా.. అంటూ తెలుగు తెరపై రీ`ఎంట్రీకి రెడీ అయిపోయారు. వినాయక్‌ డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా సినిమా సెట్స్‌పైకి అతి త్వరలోనే రానుందట. ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తర్వాత చిరంజీవి తెరపై కన్పించలేదు. ‘మగధీర’ సినిమాలో కాస్సేపు కన్పించారనుకోండి.. అది వేరే విషయం.

‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తర్వాతనే వినాయక్‌ డైరెక్షన్‌లో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. అప్పట్లో పరుచూరి బ్రదర్స్‌ ఓ కథని చిరంజీవి కోసం రెడీ చేశారు కూడా. అయినా చిరంజీవి రాజకీయాల్లో బిజీ అవడంతో, వినాయక్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌ అటకెక్కింది. ఎలాగైతేనేం.. మళ్ళీ వినాయక్‌ - చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వస్తుండడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది.

చిరంజీవి పుట్టినరోజునాటికి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవుతుందని వినాయక్‌ తాజాగా వెల్లడిరచాడు. ప్రస్తుం వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడు శీను’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం విదితమే. ఈ సినిమా సక్సెస్‌ అవుతుందనే ధీమాతో వున్న వినాయక్‌, చిరంజీవి పుట్టినరోజునాడే ఆయనతో చేయబోయే సినిమాకి ఆమోద ముద్ర లభిస్తుందని చెబుతున్నాడు.

అన్నట్టు, ఈ సినిమాని చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్‌ నిర్మించనున్న విషయం విదితమే. కథేమిటో, సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారోగానీ.. చిరంజీవి అంటూ మళ్ళీ తెరపై కన్పించడమే ఖాయమైతే అభిమానులకు మళ్ళీ పండగే.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?