Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నో బాలయ్య.. ఓన్లీ రామ్ చరణ్

నో బాలయ్య.. ఓన్లీ రామ్ చరణ్

జయజానకి నాయక సినిమా ప్రమోషన్ టైమ్ నాటి మాట. ఈ మూవీ తర్వాత వెంటనే బాలయ్యతో సినిమా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు బోయపాటి. కానీ లెక్క మారింది. రీసెంట్ టైమ్స్ లో రామ్ చరణ్ కూడా ఇలాంటిదే ఓ ప్రకటన చేశాడు. రంగస్థలం పూర్తయిన వెంటనే కొరటాలతో సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశాడు. కానీ ఇక్కడ కూడా లెక్క మారింది.

బాలయ్యతో బోయపాటి సినిమా చేయట్లేదు. చెర్రీ కూడా వెంటనే కొరటాల సినిమా స్టార్ట్ చేయడం లేదు. ప్రస్తుతానికైతే బోయపాటి-చరణ్ కలిశారు. వీళ్లకు ఉన్నది 5 నెలలు టైం మాత్రమే. ఈ గ్యాప్ లోనే సినిమా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 

వీళ్ల కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఇటు బాలయ్య, అటు మహేష్ పరోక్షంగా కారణమయ్యారు. మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను ప్రాజెక్టు ఆలస్యమౌతోంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు కొరటాల మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయలేడు. అటు బాలయ్య కూడా ప్రస్తుతానికి బోయపాటికి ఛాన్స్ ఇచ్చే పొజిషన్ లో లేడు. అందుకే చరణ్-బోయపాటి కలిశారు.

తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ లో ఈ ప్రాజెక్టు ప్రారంభమై జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?