Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అటు వివాదాలు.. ఇటు సినిమా షూటింగ్స్

అటు వివాదాలు.. ఇటు సినిమా షూటింగ్స్

అసలు నాగార్జున, వర్మ కలిసి ఓ సినిమా చేస్తున్నారనే విషయాన్ని కూడా జనాలు మరిచిపోయారు. వర్మ పేరుచెప్పగానే అందరికీ జీఎస్టీ వెబ్ సిరీస్ గుర్తొస్తోంది తప్ప, నాగార్జునతో చేస్తున్న సినిమా గుర్తుకురావడం లేదు. అంతలా ఆ సినిమాను సైడ్ ట్రాక్ లోని నెట్టేశాడు వర్మ. ఇప్పుడీ సినిమా ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుందట.

హైదరాబాద్ లో జరిగిన నాగార్జున-వర్మ కొత్త సినిమా షూటింగ్ నిన్నటితో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్ ను ఈనెల 26 నుంచి ముంబయిలో ప్రారంభిస్తారట. నాగ్, గ్యాంగ్ స్టర్స్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను, ముంబయిలోని తనమార్క్ లొకేషన్లలో చిత్రీకరించబోతున్నాడు వర్మ.

హైదరాబాద్ షెడ్యూల్ కు సంబంధించి కేవలం డైలాగ్ పార్ట్ షూటింగ్ మాత్రమే జరిగిందట. క్లోజ్/టైట్ ఫ్రేమ్స్ సెట్ చేసి నాగ్ తో డైలాగ్స్ చెప్పించాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన మియా సరీన్ కూడా ఇందులో పాల్గొంది. దాదాపు వర్మ పర్యవేక్షణ లేకుండానే ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. ఓవైపు వివాదాల వర్మ టీవీ స్టుడియోల చుట్టూ తిరుగుతుంటే, అతడి డైరక్షన్ డిపార్ట్ మెంట్ లోని సభ్యులే ఈ షెడ్యూల్ కానిచ్చేశారట.

ముంబయి షెడ్యూల్ పై మాత్రం పూర్తిగా దృష్టిపెట్టబోతున్నాడట వర్మ. సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ ఇదేనని తెలుస్తోంది. ఇకనైనా జీఎస్టీ లాంటి వ్యవహారాల్ని పక్కనపెట్టేసి, నాగ్ సినిమాపై వర్మ ఫోకస్ పెడితే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?